త్వరలో బెజవాడ దుర్గమ్మ గర్భాలయ ప్రదక్షిణ .....నిర్ణయం తీసుకున్న పాలకమండలి
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇకనుండి అమ్మవారి గర్భాలయ ప్రదక్షిణ చేసుకునే మహదవకాశం దక్కనుంది. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది దేవాదాయశాఖ.బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది.
సాధారణంగా ఎక్కడ ఏ దేవాలయంలో నైనా దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేసుకునేందుకు వీలు ఉంటుంది. కానీ కనక దుర్గమ్మ దేవాలయంలో ఇంతకు ముందు వరకు అలాంటి అవకాశం లేదు. కనకదుర్గమ్మ భక్తులకు కేవలం గిరి ప్రదక్షిణకు మాత్రమే అవకాశముండేది. అయితే అది చాలా కష్టంతో కూడుకుని వుండేది . అందుకే గర్భాలయ ప్రదక్షిణ ఏర్పాటు చేశారు.

గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఇంతకు ముందు ఎలాంటి ఏర్పాట్లు లేవు. అయితే పాలకమండలి తాజాగా తీసుకున్న నిర్ణయంతో గర్భాలయ ప్రదక్షిణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు గర్భాలయ ప్రదక్షిణకు అవకాశం కల్పిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనికి టికెట్ ధరను 300 రూపాయలు గా నిర్ణయించారు. అయితే త్వరలోనే ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తామని దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మ వెల్లడించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications