పిరికితనమే: శిద్దా రాఘవరావు పార్టీ మార్పుపై చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు సన్నిహితుడుగా పేరు సంపాదించుకున్న మాజీ మాంత్రి శిద్దా రాఘవరావు అధికార పార్టీలో చేరడంపై స్పందించారు. టీడీపీకి చెందిన మండల పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలతో చంద్రబాబు బుధవారం ఆన్లైన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బెదిరింపులు, ప్రలోభాలతో తమ పార్టీ వారిని అధికార వైసీపీ లోబర్చుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. వేధింపులకు భయపడే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని అన్నారు. టీడీపీలో కొందరు దశాబ్దాలుగా పదవులు పొంది.. ఇప్పుడు వేధింపులకు భయపడి పార్టీని వీడటం పిరికితనమే అవుతుందని అన్నారు.

టీడీపీ నుంచి ఒకరు పోతే వందమంది తయారు చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఒకరిద్దరు పార్టీని వీడినా ఏమీ కాదని.. పార్టీ మారినవారు కనుమరుగైపోయారని చంద్రబాబు అన్నారు.
కాగా, బుధవారం టీడీపీ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తన కుమారుడితోపాటు రాఘవరావు వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. పేద ప్రజల కోసం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.
-
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..!












Click it and Unblock the Notifications