పిరికితనమే: శిద్దా రాఘవరావు పార్టీ మార్పుపై చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు సన్నిహితుడుగా పేరు సంపాదించుకున్న మాజీ మాంత్రి శిద్దా రాఘవరావు అధికార పార్టీలో చేరడంపై స్పందించారు. టీడీపీకి చెందిన మండల పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలతో చంద్రబాబు బుధవారం ఆన్లైన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బెదిరింపులు, ప్రలోభాలతో తమ పార్టీ వారిని అధికార వైసీపీ లోబర్చుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. వేధింపులకు భయపడే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని అన్నారు. టీడీపీలో కొందరు దశాబ్దాలుగా పదవులు పొంది.. ఇప్పుడు వేధింపులకు భయపడి పార్టీని వీడటం పిరికితనమే అవుతుందని అన్నారు.

టీడీపీ నుంచి ఒకరు పోతే వందమంది తయారు చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఒకరిద్దరు పార్టీని వీడినా ఏమీ కాదని.. పార్టీ మారినవారు కనుమరుగైపోయారని చంద్రబాబు అన్నారు.
కాగా, బుధవారం టీడీపీ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తన కుమారుడితోపాటు రాఘవరావు వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. పేద ప్రజల కోసం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications