దాడులపై ఏపీలో డాక్టర్ల నిరసనలు- కఠిన చట్టాలు, కరోనా సాయానికి డిమాండ్
దేశవ్యాప్తంగా డాక్టర్లపై పెరిగిపోతున్న దాడులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసనలకు దిగారు. ఇవాళ ఏపీలోని విజయవాడ, గుంటూరుతో పాటు పలుచోట్ల నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు చేశారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులను తక్షణం అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కరోనాతో చనిపోయిన డాక్టర్ల కుటుంబాలకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం కరోనా వంటి కఠినమైన పరిస్ధితుల్లో పనిచేస్తున్న డాక్టర్లపై దాడులు చేయడ౦ సరికాదని విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. డాక్టర్లను ప్రభుత్వమే రక్షించాలన్నారు. కఠినమైన చట్టాలు చేసి డాక్టర్లు, ఆస్పత్రులకు రక్షణ కల్పించాలన్నారు. రోగులు టెన్షన్లో ఉంటారని, కానీ డాక్టర్ల కష్టాన్ని కూడా గుర్తించాలని వారు కోరారు. రోగులను అసాంఘిక శక్తులు ప్రభావితం చేస్తున్నాయని, అయినా డాక్టర్లు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతీ రెండు వేల మందికి ఓ డాక్టర్ ఉన్నారని, సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో డాక్టర్ అవుతామని, కానీ డబ్బున్న ప్రతీ వారూ డాక్టర్ కాలేరని వారు తెలిపారు.

అటు గుంటూరులోని ఐఎంఏ హాల్ వద్ద డాక్టర్లు నిరసనకు దిగారు. వైద్య సిబ్బందిపై దాడులకు వ్యతిరకంగా నిరసన ప్రదర్సన చేశారు. కరోనా సమయంలో సమ్మె చేయడం సరికాదని కేవలం నిరసనలు
తెలుపుతున్నామని డాక్టర్లు పేర్కొన్నారు. దాడుల్ని అరికట్టేందుకు పటిష్టమైన చట్టాలు కావాలన్నారు.
అల్లోపతి వైద్యం, వైద్యులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యల్ని డాక్టర్లు ఖండించారు. రాందేవ్ బాబాను వెంటనే అరెస్టు చేయాలన్నారు. కరోనాతో చనిపోయిన వైద్యులు, వైద్య సిబ్బందికి తగిన ఆర్ధిక సాయం అందించాలని నిరసనల్లో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.

Recommended Video
ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, ఎన్వోసిలు వెంటనే ఇవ్వాలని డాక్టర్ నందకిషోర్ డిమాండ్ చేశారు.
-
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications