టీడిపి ప్రభుత్వంపై విచారణ జరిపించండి..! ఏపి సీఎం ను కోరిన బీజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!!
అమరావతి/హైదరాబాద్ : గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిందని, వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. అంతేకాదు..వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ మాజీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వీర్రాజు.. శాసనమండలిలో రాజధాని విషయంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన ప్రసంగాన్ని తోసిపుచ్చారు. 'సభలో రాజేంద్రప్రసాద్కు నాలుగు గంటల సమయం ఇస్తే.. రాజధాని, రాజధాని అంటూ మాట్లాడారని, అసలు ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని గురించి చర్చించిన సందర్భం ఉందా?' అని ప్రశ్నించారు.

శాసనమండలిలో అనవసర చర్చ చేస్తూ ప్రజా ధనాన్ని, సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. చదరపు అడుగుకు 10,000 రూపాయల చొప్పున ఖర్చుచేసి అసెంబ్లీ నిర్మాణం చేపట్టినా.. నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత లేదని ఆరోపించారు. చిన్న వర్షం పడితేనే అసెంబ్లీ పైకప్పు లీక్ అవుతోందని, తామంతా తడిసిపోతున్నామని అన్నారు. రైతుల వద్ద ధాన్యం నేరుగా కొనకుండా మిల్లర్ల చేత కొనిపించారని గత ప్రభుత్వ విధానాలను సోము వీర్రాజు తూర్పారబట్టారు. రైతులకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా 2 సంవత్సరాల నుండి రైతులకు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టులు కూడా తాకట్టుపెట్టి రుణం తీసుకోవడానికి ప్రయత్నించారని దుమ్మెత్తిపోశారు. సీబీఐని రాష్ట్రానికి రాకుండా నిలువరించిన మాజీ సీఎం చంద్రబాబు.. ఇక్కడి డీఐజీతో ప్రత్యర్థులందరిపై దాడులు చేయించారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు సహా అనేక కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని, వీటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కోరామని వీర్రాజు చెప్పారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications