అమరావతిపై సీఎం జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి... కన్నా లక్ష్మినారాయణ
రాష్ట్రం అభివృద్ది చెందాలంటే... అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని.. కాని పరిపాలన వికేంద్రీకరణ సరికాదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగులు ఇప్పుడిప్పుడే.. సర్ధుకుంటున్నారని వారు మళ్లి విశాఖ వెళ్లడం సాధ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాజధానిలో పార్టీ బృందం పర్యటిస్తుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు రావొచ్చంటూ శాసనసభలో సీఎం జగన్ చేసిన ప్రకటన సీఎం జగన్మోహన్ రెడ్డి అనుభవరాహిత్యానికి నిదర్శనమని అన్నారు.
రాష్ట్ర రాజధానిపై సీఎం చేసిన ప్రకటనతో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది బీజేపీ నేతలు స్వాగతిగిస్తుండగా మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ రాజధానికి శంకుస్థాపన చేయడం, రాజధాని ప్రాంతానికి రైతులు వేల ఎకరాలు ఇవ్వడంతో అటు పార్టీతో పాటు రైతులు కూడ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కూడ సీఎం నిర్ణయంపై అచితూచి మాట్లాడుతున్నారు.

రాజధానులు ఏర్పాటు కావచ్చు అంటూ సీఎం జగన్ చెప్పారు కాని, పూర్తిగా మూడు రాజధానులు వస్తాయని చెప్పలేదంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మరోవారంలో రాజధానిపై నివేదిక రానున్న నేపథ్యంలోనే సీఎం ప్రకటనపై టీడీపీ, బీజేపీతో పాటు జనసేన పార్టీలు వ్వతిరేకిస్తూ... పలు విమర్శలు చేస్తున్నాయి.
-
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications