ఏపీ రాజధానిపై కేశినేని నానీ ప్రశ్న ... మరోసారి రాజధానిపై కుండ బద్దలు కొట్టిన కేంద్రం
ఏపీ రాజధానిపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నా మొన్నాటి దాకా రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని భావిస్తే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని విషయం రాష్ట్రాల పరిదిలోనిది అని తేల్చి చెప్పింది కేంద్రం . అప్పుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు 2015లో అప్పటి ప్రభుత్వం అమరావతిని ఏర్పాటు చేస్తే దాన్ని కేంద్రం నోటిఫై చేసిందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. మూడు రాజధానుల అంశంపై కూడా మీడియా ద్వారా తెలుసుకున్నామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఇక తాజాగా కేశినేని నానీ అడిగిన ప్రశ్నకు మరోమారు కేంద్రం ఏపీ రాజధాని అంశంపై పార్లమెంట్లో స్పష్టతనిచ్చింది.
రాజధానిపై నిర్ణయం కేంద్రం పరిధిలోనిది కాదని తేల్చి చెప్పింది. ఇక రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదేనని పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరోమారు రాజధాని అంశంపై కేంద్రం చేతులెత్తేసింది . లిఖితపూర్వక సమాధానం ఇచ్చి మరీ రాజధాని ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పింది.

ఇక అంతేకాదు ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కూడా స్పష్టం చేసింది. ఇక ఈ సమాధానంతో రాజధాని రైతుల ఆశలపై నెలలు చల్లినట్టు అయ్యింది. మరోవైపు ఈ సమాధానం ఏపీలోని బీజేపీ వర్గాలకు, అలాగే తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన వర్గాలకు అసలు రుచించటం లేదు . మరోసారి పార్లమెంటులో కేంద్రం రాజధానిపై స్పష్టత ఇవ్వటంతో కేంద్రం ఎలాంటి జోక్యం రాజధాని విషయంలో చేసుకోదని అర్ధం అవుతుంది . అంతకు ముందు కూడా ఇదే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications