విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులివెందులకు పిల్లిలా.. సత్య ప్రమాణం ఎందుకు చేయలే, జగన్‌పై లోకేశ్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేకా హత్యలో జగన్ పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ఏ సంబంధం లేదనే తిరుమల వెంకన్న సాక్షిగా తాను ప్రమాణం చేశానని లోకేశ్ చెప్పారు. అదేవిధంగా జగన్ చేయాలని సవాల్ విసిరారు. జగన్ కుటుంబానికి సంబంధం లేదని వెంకన్నపై ప్రమాణం చేయాలని తాను విసిరిన ఛాలెంజ్‌కు జగన్ భయపడ్డారని చెప్పారు. అందుకోసమే పులివెందులకు పిల్లిలా పారిపోయాడని చెప్పారు.

వివేకానంద మర్డర్ మిస్టరీ వీడిపోయిందని చెప్పారు. బాబాయ్‌ని వేసేసింది అబ్బాయే అని అన్నారు. వైయస్ వివేకా హత్య కేసులో తమకు సంబంధం లేదని తిరుపతిలోని అలిపిరిలో వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. తనలా జగన్ ఎందుకు చేయడం లేదని చెప్పారు. దీంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. తాను ఏ తప్పు చేయకుంటే సత్య ప్రమాణం చేయడంలో ఆలస్యం ఎందుకు అని అడిగారు.

ys jagan ran away from my challenge: nara lokesh

నారా లోకేశ్ ఇవాళ తిరుపతి అలిపిరి వద్దకు చేరుకుని.. అక్కడ గల గరుడ సర్కిల్ వద్ద ప్రమాణం చేశారు. కత్తితో బతికే వాడు కత్తికే చస్తాడని అన్నారు. జగన్ రెడ్డి ఇక్కడకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసేందుకు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. జగన్ తన నివాసం నుంచి 45 నిమిషాల్లో ఇక్కడకు రావచ్చని చెప్పారు. కానీ జగన్ మాత్రం అంత ధైర్యం చేయడం లేదన్నారు.

English summary
ap cm ys jagan mohan reddy ran away from my challenge tdp leader nara lokesh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X