యూఆర్ గ్రేట్ మహేశ్ బాబు.. చిన్నారుల హార్ట్ సర్జరీపై సాయి రెడ్డి, ట్వీట్
ఇటీవల 30 మంది చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్ బాబు హార్ట్ సర్జరీ చేయించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు స్పందించారు. మహేశ్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వంతు వచ్చింది. ఆయన మహేశ్ బాబు దాతృత్వాన్ని కొనియాడారు. కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికపై మహేశ్ బాబును అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహేశ్ బాబును రియల్ హీరోగా కీర్తిస్తూ పొగిడారు.
వరల్డ్ హెల్త్డేను పురస్కరించుకుని మహేశ్ బాబు 30 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్స చేయించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సాయిరెడ్డి ప్రస్తావించారు. మహేశ్ బాబు దయాగుణం కలిగిన వారని కొనియాడారు. ప్రజల మెరుగైన జీవితాల కోసం రియల్ హీరోలు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారని ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా కొందరే చేయగలరని చెప్పారు.

మహేష్ బాబు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 30 మంది చిన్నారులకు గుండె చికిత్సలు చేయించారు. సామాజిక సేవలో పాలు పంచుకునే మహేష్ హీల్-ఎ-చైల్డ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ రన్ చేస్తున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేసి.. ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇదే విషయాన్ని నమ్రత ప్రపంచానికి చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 30 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్స జరిగాయి. మహేష్ బాబు భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. శస్త్రచికిత్సలు విజయవంతం చేసిన డాక్టర్లను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే.
In a wonderful act of kindness, actor Mahesh Babu sponsored heart surgeries of 30 children on the occasion of #WorldHealthDay. Real heroes are indeed those who work selflessly to make people’s lives better!@urstrulyMahesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2022
విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్, మహేష్ బాబు ఫౌండేషన్లోని డాక్టర్ల సహాయంతో 30 మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయించారు. ఆపరేషన్లు విజయవంతం అయినందుకు డాక్టర్లకు నమత్ర కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బాబు తనది గోల్డెన్ హార్ట్ అని మరోసారి నిరూపించుకున్నారని కామెంట్ చేశారు. దీంతో అతని గొప్పతనం మరోసారి రుజువైందని అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications