ఏపీ బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావు కన్నుమూత
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి పీవీ చలపతిరావు పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించారు.
చలపతిరావు మరణం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన చలపతిరావు తనకు మార్గదర్శకులని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయమని సోము వీర్రాజు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆనాటి జనసంఘ్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుల్లో చలపతిరావు ఒకరని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చలపతిరావు చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.
కాగా, చలపతిరావు కుమారుడు పీవీ మాధవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏపీ బీజేపీ శాసనమండలి పక్షనేతగా కొనసాగుతున్నారు. చలపతిరావు మృతితో మాధవ్ కుటుంబంలో విషాదం నెలకొంది. పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలపడంతోపాటు పరామర్శించేందుకు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
-
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications