వైజాగ్ లో ప్రధాని మోడీ సభ ప్రారంభం-రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల నమూనాల పరిశీలనతో మొదలు
ఏపీలో ప్రధాని మోడీ టూర్ లో భాగంగా ఇవాళ విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సభ ప్రారంభమైంది. ఈ సభకు ప్రధాని మోడీతో పాటు సీఎం జగన్, గవర్నర్ హరిచందన్ హాజరయ్యారు. వీరితో పాటు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. దీంతో మోడీ సభ జనసంద్రంగా మారింది.

ముందుగా ప్రధాని మోడీ విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్ కు చేరుకున్న తర్వాత శంఖుస్ధాపనలు జరిగే ప్రాజెక్టుల నమూనాల్ని సీఎం జగన్, గవర్నర్ హరిచందన్ తో కలసి పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీటిని పరిశీలించిన ప్రధాని మోడీ.. సీఎం జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సభా వేదికపైకి ఇరువురూ చేరుకున్నారు. ఆ తర్వాత సీఎం జగన్ ప్రసంగం ప్రారంభమైంది.













Click it and Unblock the Notifications