వద్దంటే వాన.. మరో అల్పపీడనం, 24 గంటల్లో జోరు వాన
వర్షాలు వరదలతో ఇప్పటికే జనం అల్లాడిపోయారు. కొందరికీ నిలువ నీడ లేకపోగా.. మరికొందరికీ తినడానికి తిండి లేదు. కరెంట్ నిలిపివేయడంతో.. చిమ్మ చీకట్లో ఉండిపోయారు. వారం తర్వాత వర్షం వెలసింది కదా అనుకున్నాం.. కానీ వాతావరణ కేంద్రం మరో పిడుగులాంటి వార్త చెప్పింది. అదే అల్పపీడనం ఉందని చెప్పడంతో బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే మళ్లీ వానలా అని జనం అనుకుంటున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు అంతా సద్దుమణగలేదు.

ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రుతుపవనద్రోణి ఉత్తర ఒడిశా మీదుగా విస్తరించి ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై మోస్తరుగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం బలహీనపడి...మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications