Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ఆత్మహత్య-ఫర్నేస్‌లో దూకుతానని ఉద్యోగి లేఖ-హై టెన్షన్‌

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నగరంలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకోవడం కోసం కార్మికులు ఆందోళన బాట పట్టగా.. ఇప్పుడు ఏకంగా ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. దీంతో స్టీల్‌ ప్లాంట్ పరిసరాల్లో ఆందోళన నెలకొంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రయత్నాలకు నిరసనగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ లేఖ రాశాడు. అనంతరం అదృశ్యం అయ్యాడు. దీంతో సాటి ఉద్యోగులు, కార్మికుల్లో టెన్షన్‌ నెలకొంది. ఈ లేఖలో శ్రీనివాసరావు ప్రస్తావించిన అంశాలు కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో ఉక్కు ప్లాంట్‌ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.

vizag steel plant employee missing after writing suicide letter against privatisation

కార్మికులారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం, ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిభలం ఈ ఉక్కు కర్మాగారం, ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి కావడానికి 5.49 నిమిషాలకు ముహుర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటం, ప్రాణత్యాగం నా నుంచి మొదలు కావాలంటూ ఉద్యోగి శ్రీనివాసరావు లేఖ రాసి అదృశ్యమయ్యారు. దీంతో ఇప్పుడు శ్రీనివాసరావు కోసం గాలింపు సాగుతోంది.

vizag steel plant employee missing after writing suicide letter against privatisation

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+