ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: ఏపీ జవాన్లు వీరమరణం: రూ.30 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన జగన్
అమరావతి: ఛత్తీస్గఢ్లోని బిజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో శనివారం చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్లో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఒకరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండర్ శాఖమూరి మురళీకృష్ణ, విజయనగరం గాజులరేగకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను రౌతు జగదీశ్ ఉన్నారు. వీర మరణం పొందిన రౌతు జగదీశ్కు విజయనగరం వాసులు ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ పతాకంతో విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.
గాజులరేగలో నివసించే రౌతు సింహాచలం, రమణమ్మ దంపతుల కుమారుడు జగదీశ్. ఆయనకు ఇటీవలే పెళ్లి కుదిరింది. వచ్చేనెల 22 తేదీన పెళ్లి వేడుకలను నిర్వహించాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. దీనికోసం జగదీష్ ఈ నెల 15వ తేదీన విజయనగరానికి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అంతలోపే ఛత్తీస్గఢ్లో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. 2010లో ఆయన సీఆర్పీఎఫ్ జవాన్గా ఎంపికయ్యారు. మావోయిస్టులను ఏరివేయడానికి ఏర్పాటు చేసిన కోబ్రా వింగ్లో చేరారు. ఇదే ఎన్కౌంటర్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండర్ శాఖమూరి మురళీకృష్ణ అమరులయ్యారు.

రౌతు జగదీశ్, శాఖమూరి మురళీకృష్ణ వీరమరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్.. ఆ రెండు కుటుంబాలకు భారీ ఎత్తున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 30 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఈ తెలుగువీరుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, తక్షణ ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications