వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్రీ పాయింట్ ఒకరు, ట్యాక్సీ తో ఇంకొకరు : కరోనా కలిపింది ఇద్దరినీ, డబ్బు కోసం గంజాయి దందా !!

|
Google Oneindia TeluguNews

భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు స్మగ్లర్ల ముఠాను వరంగల్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం టాస్క్ ఫోర్స్ మరియు జనగాం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుండి నూమారు 12లక్షల 60వేల రూపాయల విలువగల 126 కిలోల గంజాయితో పాటు, ఒక కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో గుగులోత్ సుధాకర్, గుగులోత్ సురేష్, టితోలియా దినేష్ లు ఉన్నారు.

ముగ్గురు సభ్యుల గంజాయి ముఠాను పట్టుకున్న వరంగల్ కమీషనరేట్ పోలీసులు

ముగ్గురు సభ్యుల గంజాయి ముఠాను పట్టుకున్న వరంగల్ కమీషనరేట్ పోలీసులు

వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ గంజాయి స్మగ్లింగ్ ముఠా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన గుగులోత్ సుధాకర్ జీవనోపాధి కోసం హైదరాబాద్ లో కర్రీ పాయింట్ నిర్వహిస్తూ జీవించేవారు. ఇదే సమయంలో నిందితుడికి వరుసకు మామ అయిన వ్యక్తి ద్వారా హైదరాబాద్లో గంజాయి అమ్మకాలు జరిపే మరో నిందితుడు టితోలియా దినేష్ తో పరిచయం అయిందని తెలిపారు.

కరోనా దెబ్బ .. ఒకరికి కర్రీ పాయింట్ లో నష్టం , ఒకరికి ట్యాక్సీ బిజినెస్ లో నష్టం

కరోనా దెబ్బ .. ఒకరికి కర్రీ పాయింట్ లో నష్టం , ఒకరికి ట్యాక్సీ బిజినెస్ లో నష్టం

కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ కారణంగా కర్రీ పాయింట్ వ్యాపారంలో నష్టం రావడంతో తిరిగి వరంగల్ జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్న నిందితుడు సుధాకర్ గంజాయి దందా చేయాలని నిర్ణయించుకున్నాడు.ఇతనికి మరో నిందితుడు సురేష్ తో పరిచయం అయింది. సురేష్ జీవనోపాధి కోసం సెకండ్స్ లో కారును కోనుగోలు చేసి కారును టాక్సీ తిప్పుతూ డబ్బు సంపాదించేవాడు. కాని లాక్ డౌన్ కారణంగా అతని బిజినెస్ సరిగా నడవక పోవడంతో సుధాకర్ తో చేతులు కలిపాడు.

 డబ్బు కోసం గంజాయి దందా మొదలుపెట్టిన ఇద్దరు

డబ్బు కోసం గంజాయి దందా మొదలుపెట్టిన ఇద్దరు

ఇద్దరూ కలిసి గంజాయి దందా చేయాలని నిర్ణయించుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి అక్రమ రవాణాకు తెర తీశారు.మామ ద్వారా పరిచయమైన గంజాయి స్మగ్లర్ తో డీల్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నం నుండి గంజాయిని తక్కువ ధరకు కోనుగోలు చేసి మిగతా ఇద్దరు నిందితుల ద్వారా గంజాయిని ఎక్కువ మొత్తంలో అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు పలుమార్లు నర్సీపట్నం నుండి తన కారులో గంజాయిని హైదరాబాద్ కు తరలించాడు.

గంజాయి అక్రమ రవాణా యత్నం .. పట్టుకున్న పోలీసులు

ఇదే రీతిలో నిందితుడు మరోమారు ఈ నెల 29వ తేదిన నర్సీంపట్నంలో 126 కిలోల గంజాయిని కోనుగోలు చేసి రెండు కిలోల చొప్పున ప్యాకెట్లు గా తయారు చేసి తన కారులో భద్రపర్చి హైదరాబాద్ కు తరలించే క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు చేసి నిందితులను పట్టుకున్నారు. పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చెయ్యగా వారిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు .ఈ బిజినెస్ చేసే ముగ్గురు నిందితులు వరంగల్ జిల్లాకు చెందినవారే.

భారీగా గంజాయి స్వాధీనం .. 126 కిలోల గంజాయిని, కార్ ను సీజ్ చేసిన పోలీసులు

భారీగా గంజాయి స్వాధీనం .. 126 కిలోల గంజాయిని, కార్ ను సీజ్ చేసిన పోలీసులు

జనగామ పోలీసులు వాహన తనిఖీలలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోని విచారించగా తాము పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు. నిందితుల నుండి 126 కిలోల గంజాయితో పాటు, గంజాయి రవాణాకు వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కరోనా కొట్టిన దెబ్బతో అక్రమ మార్గంలో అయినా డబ్బు సంపాదించాలని గంజాయి దందాలోకి దిగి అడ్డంగా పోలీసులకు బుక్కయ్యారు.

English summary
A gang of three smugglers involved in large-scale cannabis smuggling was jointly arrested by the Task Force and Janagaon police on Friday within the Warangal Commissionerate. Police seized 126 kg of cannabis, a car and three cellphones worth Rs 12 lakh 60 thousand from the gang members.Among those arrested by the police were Gugulot Sudhakar, Gugulot Suresh and Titolia Dinesh. One of them is a curry point operator while the other earns a living by renting a taxi. They went into marijuana danda after suffering a business blow due to corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X