మాట కలిపి.. మత్తుమందిచ్చి.. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో దోపిడీ
కాజీపేట : రైల్లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణీకులకు మత్తుమందు ఇచ్చి అందినకాడికి దోచుకెళ్లారు. యశ్వంత్పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు ప్రయాణించే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది. ఆరుగురు ప్రయాణీకులను మాటలతో ముగ్గులోకి దించి.. ఆ తర్వాత మత్తుమందిచ్చి దోపిడికి పాల్పడ్దారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాధితులు కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆదివారం నాడు సొంతూళ్లకు వెళ్లేందుకు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. అయితే ధర్మవరం రైల్వే స్టేషన్ దాటాక.. తోటి ప్రయాణీకుల్లా నటించిన దోపిడి దొంగలు వారితో మాట కలిపారు. కాస్తా చనువు పెరిగాక మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్, బిస్కెట్లు ఇవ్వడంతో బాధితులు స్పృహ కోల్పోయారు. అదే అదనుగా వారి నుంచి నగదు, వాచీలు, గోల్డ్ రింగులు, సెల్ఫోన్లు దోచుకుని తర్వాత స్టేషన్లో దిగిపోయినట్లు సమాచారం.

విషయం తెలిసి జీఆర్పీ పోలీసులు అలర్టయ్యారు. రైలు కాజీపేటకు చేరుకోగానే బాధితులకు మొదటగా వైద్యం అందించే నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వారు స్పృహలోకి వచ్చాక విషయం పూర్తిగా తెలుసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications