వరంగల్ లో సీఎం కేసీఆర్ టూర్ .. పెట్రోల్ బాటిల్ తో వృద్ధ దంపతులు .. అసలేం జరిగిందంటే!!
వరంగల్ అర్బన్ జిల్లాలో గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఓ దంపతుల జంట సీఎం కేసీఆర్ ని కలవడానికి ప్రయత్నించారు. తమ భూమి కబ్జా చేశారంటూ కేసీఆర్ ని కలవడానికి వెళ్లిన దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు.
సీఎం కేసీఆర్ గతంలో కేంద్ర కారాగారం ఉన్న స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ కు వస్తున్న క్రమంలో కేంద్ర కారాగారం వద్దకు సీఎం కేసీఆర్ ని కలవడానికి వెళ్లిన దంపతుల జంట పోలీసులు కేసీఆర్ ను కలవడానికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్య పేట గ్రామంలో తమ నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ వారు కెసిఆర్ కు తమ గోడును చెప్పుకోవడానికి వచ్చారు.

వరంగల్ కొత్త వాడ కు చెందిన గాదం ఓదమ్మ , కట్టయ్య దంపతులు తమతో పాటు పెట్రోల్ బాటిల్ తెచ్చుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని ప్రయత్నం చేయగా గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Recommended Video
వారి సమస్య తెలుసుకుని వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ వరంగల్ అర్బన్ జిల్లా పర్యటన నేపధ్యంలో పోలీసులు చాలా కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది .
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications