పోలవరం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం ..ఏపీకి అన్నీ మంచి శకునములే
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారం అందుతోంది . ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంది. అదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీతో కూడా జగన్ సత్సంబంధాలు నెరపాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఆయన తిరుపతి సందర్శనకు వచ్చినప్పుడు జగన్ స్వయంగా అక్కడికి వెళ్లి మరీ మోడీని రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఆయనతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదన.. పోలవరానికి నిధుల విడుదల
ఇక తాజాగా కేంద్రం నుండి మరో గుడ్ న్యూస్ వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి నిధులు విడుదల చెయ్యాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 3వేల కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిధులను నాబార్డు నుంచి విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. అంతేకాదు, ఎప్పటికప్పుడు యూసీలను పంపిస్తే ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.

చంద్రబాబు హయాంలో అందని కేంద్ర సహకారం
గతంలో చంద్రబాబు పాలనలో పోలవరం నిధులు ఇవ్వకుండాఇబ్బంది పెడుతున్నారని పలు మార్లు ఆరోపించారు. ఇక కేంద్రం తో ప్రత్యేక హోదా కోసం పంచాయితీ పెట్టుకున్న టీడీపీ కేంద్రం నుండి ఏ మాత్రం సహకారం తీసుకోలేకపోయింది. కాబట్టి జగన్ వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరేలా మంత్రాంగం నెరపాలని చూస్తున్నారు. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇక అందులో భాగంగానే నిన్న రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాత్ దాస్ ను ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి పంపారు.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్.. కేంద్రం కూడా సానుకూలం
పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేతకు సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల సడలింపు జూలై 2తో ముగియనుండటంతో సడలించడం కాకుండా... పూర్తిగా ఎత్తివేసేలా సంబంధిత శాఖల అధికారులతో చర్చించాలని జగన్ సూచించారు. మొత్తానికి జగన్ పాలన ప్రారంభం అయిన తరువాత రాష్ట్రానికి కేంద్రం నుండి కొన్ని సానుకూల సంకేతాలు వస్తున్నట్టు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా అందులో భాగమే . అందుకే జగన్ సీఎం అయిన తరువాత కేంద్రం స్పందిస్తున్న తీరుతో అన్నీ మంచి శకునములే అని అంటున్నారు ఏపీ ప్రజలు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications