వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో గోపాల్ రెడ్డికి ఎన్నారైల సత్కారం

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
పాలమూరు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక వైస్ చాన్సలర్ ఆచార్య వి. గోపాల్ రెడ్డిని పాలమూరు ఎన్నారై వేదిక అమెరికాలోని న్యూజెర్సీలో గల సోమర్సెట్ లో సత్కరించింది. గోపాల్ రెడ్డి వేదిక సభ్యులను, ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. మహబూబ్ నగర్ పట్టణంలో విశ్వవిద్యాలయ భవన నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 187 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఏడాది క్రితం విశ్వవిద్యాలం వైస్ చాన్సలర్ గా గోపాల్ రెడ్డి నియమితులయ్యారు.

విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్రం, మైక్రో బయోలజీ, గణిత శాస్త్రం, ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో 14 మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ల్లో 850 మంది విద్యార్థుల చదువుతున్నట్లు, తాజాగా ఫార్మసీ స్కూల్ ను చేర్చినట్లు గోపాల్ రెడ్డి చెప్పారు. వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని వేగంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయానికి అకడమిక్, ఫైనాన్షియల్ సాయం అందిస్తున్న పాలమూరు ఎన్నారైలు చేస్తున్న సాయాన్ని ఆయన అభివందించారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల అకడమిక్ సహకారాన్ని తీసుకోవడానికి ఎన్నారైలు తోడ్పడగలరని ఆయన ఆశించారు. గ్రంథాలయం, హాస్టల్, లెక్చర్ హాల్ వంటి వసతుల కల్పనకు ముందుకు రావాలని ఆయన ఎన్నారైలను కోరారు. ప్రొఫెసర్ కాంతారెడ్డి, దయాసాగర్ రావు వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X