అమెరికా సిలికాన్ వ్యాలీలో సమైక్యాంధ్ర గళం

ఈ సభలో సమైకాంధ్రప్రదేశ్పై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భక్త భల్లా, చైతన్యరెడ్డి, వెంకట్ మద్దిపాటి, శ్రీనివాస్ వేముల, సతీష్ అంబటి, తులసి తుమ్మల శ్రీకాంత్ కోనేరు తదితరులు నిర్వహించిన ఈ సభలో రాజకీయ అవకాశవాదాన్ని ఆసరాగా తీసుకుని తెలుగు వారి మధ్య విభేదాలు సృష్టిస్తున్నారనీ పలువురు వక్తలు ఆవేశంగా ప్రసంగించారు.
వెనుకబాటు తనానికి వేర్పాటు వాదాలు పరిష్కారం కాదనీ, అవి అభివృద్ది వైపు తీసుకెళ్ళలేవని ఆవేదనతో అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే తెలుగు వారి ప్రగతే ముక్కలైపోతుందని అన్నారు. సమైకంగా ఉంటేనే అభివృద్ది సాధించడం సులభతరం అవుతుందన్న అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
ఐటి రంగంలో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందనీ, ఆ విజయం తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారందరిదీనని గుర్తు చేశారు. ఎవరినీ సంప్రదించకుండా, ఆఖరికి ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా చేసిన తెలంగాణ ప్రత్యేక ప్రకటన, అదీ అర్ధరాత్రి హడావుడిగా నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అభివృద్ది కుంటుపడుతుందని మరికొందరు వక్తలు ప్రసంగించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications