అమెరికాలో ఎన్నారై దంపతుల మృతి

దంపతులిద్దరూ వాషింగ్టన్లో ఉన్న తమ ఏకైక కుమార్తె కావ్య విశ్వనాథన్ వద్దకు తమ సొంత విమానంలో వెళ్లివస్తూ శుక్రవారం సాయంత్రం మార్గమధ్యలో కొలంబస్లో ఆగారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తమ సింగిల్ ఇంజిన్ విమానం సిరస్ సీఆర్22కు రికెన్బేకర్ విమానాశ్రయంలో ఇంధనం నింపుకొన్నారు. ఆ తర్వాత బయలుదేరిన రెండు నిమిషాలకే సమీప పంటపొలంలో విమానం కూలిపోయిందని ఓహియో రాష్ట్ర పోలీస్ అధికారులు వెల్లడించారు.
ప్రమాద సమయంలో డాక్టర్ విశ్వనాథన్ స్వయంగా విమానం నడుపుతున్నారని, నలుగురు ప్రయాణించటానికి వీలున్నప్పటికీ దంపతులిద్దరే ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరి కుమార్తె కావ్య విశ్వనాథన్ (24) తాను రాసిన నవలతో 2006లో సంచలనం సృష్టించారు. ''హౌ ఒపల్ మెహతా గాట్ కిస్డ్, గాట్ వైల్డ్, అండ్ గాట్ ఈ లైఫ్'' నవల రచనకు ఆమె గ్రంథ చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications