డల్లాస్లో ఎన్నారైల టెన్నిస్ టోర్నీ
టాంటెక్స్ యువజన, క్రీడా కమిటీ చైర్ కృష్ణ కోరాడ స్వాగతం చెప్పారు. క్రీడా కమిటీ సభ్యుడు మహేష్ ఆదిభట్ల ఆట నియమాలను వివరించారు. టాంటెక్స్ అధ్యక్షుడు ఎన్ఎంఎస్ రెడ్డి తమ సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. ఐఎఎన్టి ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి క్రీడల్లో పెద్ద యెత్తున పాల్గొనాలని భారత ఎన్నారైలకు పిలుపునిచ్చారు. పోటీల్లో గెలవడం, ఓడడం ముఖ్యం కాదని, క్రీడాస్ఫూర్తిని అలవరుచుకోవడమే ముఖ్యమని ఐఎఎన్టి సంయుక్త కార్యదర్సి బల్కి చంకుర అన్నారు. టాంటెక్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గీతా దమ్మన్న జెండా ఊపి పోటీలను ప్రారంభించారు.
సింగిల్స్ పోటీల్లో శశిధర్ ఉరిమిడి విజేతగా నిలిచారు. గోకుల్ నూనే రెండో స్థానంలో నిలిచారు. డబుల్స్లో మధు మల్లు, కిశోర్ కసక్ విజయం సాధించగా, లక్ష్మీకాంత్, ఎలెక్స్ రాజా జంట రెండో స్థానంలో నిలిచింది. పోటీల్లో పాల్గొన్నవారికి కోరాడ కృతజ్జతలు తెలిపారు. నోట్యోంకు చెందిన మనోహర్ వజ్జా, డాక్టర్ కొర్సపాటి, చంకుర, ఎన్ఎంఎస్ రెడ్డి, ఉదయ్ బి పెంటకొట, డాక్టర్ నరసింహారెడ్డి ఉరిమిడి విజేతలకు ట్రోఫీలు అందించారు.