జయశంకర్కు తెలంగాణ ఎన్నారైల సంతాపం

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్) డెట్రాయిట్ అమెరికా చాప్టర్ ఈ నెల 24వ తేదీ జయశంకర్ సంతాప సభను నిర్వహించారు. టిడిఎఫ్ డెట్రాయిట్ చాప్టర్ మిచిగాన్లోని నార్త్విల్లేలో ఈ సంతాపసభ జరిగింది. వంద మందికిపైగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ సాధించాలనే జయశంకర్ కలను సాకారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా ఎన్నారైలు తెలంగాణ నాయకులను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనే జయశంకర్ మృతికి అర్పించే నిజమైన నివాళి అని వారన్నారు. అమెరికాలో టిడిఎఫ్ను ఏర్పాటు చేయడంలో జయశంకర్ నిర్వహించిన కీలకమైన పాత్రను వారు నెమరేసుకున్నారు.












Click it and Unblock the Notifications