వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Australia
ఆస్ట్రేలియాలో ఓ తెలుగు విద్యార్థి మరణించాడు. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థి ఆస్ట్రేలియాలో చదువుకుంటూ సెలవు రోజని సముద్రతీరానికి వెళ్లి అలల తాకిడికి మృతి చెందిన సంఘటన అదివారం జరిగింది. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి చెందిన కొండ్రగుంట వెంకటేశ్వర్లు కుమారుడు విజయరాజు మూడేళ్లుగా ఆస్ట్రేలియా దేశంలోని మెల్‌బోర్న్‌లో ఇంజినీరింగు విద్య చదువుతున్నారు.

రెండు రోజులు సెలవులు రావడంతో అతడు స్నేహితులతో కలిసి అడిలైట్‌ సముద్ర తీరానికి వెళ్లారు. అలల తాకిడికి ప్రమాదవశాత్తు సముద్రంలోకి విజయరాజుతో పాటు మరో విద్యార్థి కొట్టుకుపోయారు. కొద్ది సేపటి తరువాత వారిరువురి మృతదేహాలు తీరానికి వచ్చినట్లు వారి సహ విద్యార్థులు ఫోన్‌లో ఈదుమూడిలోని విద్యార్థి తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచార మందించారు.

English summary
Telugu student dead in Australia. The student Kondragunta Venkateswarlu belongs to Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X