విదేశాల్లో వైయస్సార్ వర్ధంతి
రమణారెడ్డి కంజుల అతిథులకు స్వాగతం చెప్పి, వైయస్ జీవితం ప్రాముఖ్యాన్ని వివరించారు. వైయస్ ప్రజల గుండెలను స్పృశించారని ఆయన అన్నారు. వైయస్ ధైర్యసాహసాల గురించి, నాయకత్వ లక్షణాలపై జయదీష్, నవ చైతన్యా రెడ్డి వివరించారు. లక్షలాది మందిని వైయస్ తన కుటుంబ సభ్యులుగా మార్చుకున్నారని వారన్నారు. పేదలకు, వికలాంగులకు, తదితర అణగారిన వర్గాలకు వైయస్ ఆత్మబంధువు అయ్యారని వారన్నారు.
వైయస్ వంటి మహా నాయకుడు ఇంతకు ముందు జన్మించలేదు, మళ్లీ పుట్టబోరని, వైయస్ లేని లోటును ఎవరూ పూరించలేరని, వైయస్ వంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఇంతకు ముందు ఎవరూ లేరని పుల్లారెడ్డి, జీవన్, శివ, ప్రసాద్ అన్నారు.
మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి తృతీయ వర్ధంతిని అమెరికాలోని అట్లాంటాలో ఎన్నారైలు నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన ఈ కార్యక్రమం జరిగింది. వైయస్ నాయకత్వ లక్షణాలను, వైయస్తో తమకు గల అనుబంధాన్ని కార్యక్రమానికి వచ్చినవారు గుర్తు చేసుకున్నారు. వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, రాగి ముద్దలు పెట్టి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.