శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్దానం గ్రామాల దత్తతకు ఎన్నారైలు

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
మంచినీటి కొరతతో, మూత్రపిండాల వ్యాధితో మరణాలు సంభవిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం గ్రామాలను దత్తత తీసుకోవడానికి ఎన్నారైలు ముందుకు వస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్), గజల్ చారిటబుల్ ట్రస్టు సంయుక్తంగా ఆ గ్రామాలను దత్తత తీసుకుంటున్నాయి. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ గజల్ చారిటబుల్ ట్రస్టుకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇటీవల ఉద్దానం గ్రామాలను సందర్శించారు. బల్లిపుట్టుక, ప్రగడ పుట్టుక, పెద్ద శ్రీ రామపురం, చిన్న శ్రీరామపురం, కవిటి, సోంపేటల మీదుగా ఆయన పాదయాత్ర సాగింది.

ప్రతి గ్రామంలోనూ సగం మంది మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన గుర్తించారు. దాంతో ప్రతి నెల ఐదారు మంది చనిపోతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. మృతుల్లో 12 ఏళ్ల వయస్సు లోపు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో చాలా మంది దినసరి కార్మికులు. చికిత్సకు డబ్బులు లేక, దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో గల ఆస్పత్రులకు ప్రయాణఖర్చులు భరించలేక వారు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.

వారి దయనీయ పరిస్థితిని గమనించి, ఇచ్చాపురం శానససభ్యుడు పి. సాయిరాజ్ నేతృత్వంలోని ఉద్దానం ఫౌండేషన్‌తో కలిసి నాట్స్, గజల్ చారిటబుల్ ట్రస్టు పీడిత గ్రామాల్లో 40 లక్షల రూపాయల వ్యయంతో డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, 3 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను స్పాన్సర్ చేయాలని నిర్ణయించినట్లు నాట్స్ ఉద్దానం హెల్ప్ లైన్ ఓవర్సీస్ ఇంచార్జీ రమణమూర్తి గులివిందల చెప్పారు.

English summary
North America Telugu Society (NATS) and Ghazal Charitable Trust Jointly adopted the villages affected with kidney failure and deaths due to poor drinking water of Uddanam area in Srikakulam district of Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X