అమెరికాలో శంకుస్థాపన పూజ
ఇల్లినాయిస్: శ్రీ సాయీ సంస్థాన్, సెంట్రల్ ఇల్లినాయీస్ వారిచే ఆదివారంనాడు ఈ నెల 11వ తేదీన 407,బ్రాన్కో డ్రైవ్ , బ్లూమింగ్టన్ లో శ్రీ సాయి మందిర నిర్మాణానికి సంప్రదాయబద్ధంగా శంఖు స్థాపన జరిగింది. వాస్తు పూజ, హోమం, నవధాన్యార్పణ, హారతి మున్నగు వేదవిధులతో, ఈ పవిత్ర కార్యక్రమం ఆద్యంతం అత్యంత వైభవోపేతంగా జరిగింది.
ఏడు వందలక పైగా భక్తులు ఆబాలగోపాలం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. దేవాలయ భూ ప్రాంగణమంతా భక్తుల పవిత్ర హృదయ స్పందనలతో నిండి పోయి పండుగ వాతావరణం సంతరించుకుంది.
సెంట్రల్ ఇల్లినాయిస్ పరిసర ప్రాంత భక్తులందరూ -ఆనంద పారవశ్యంగా శ్రీ సాయినాధుని కొలవడానికి బ్లూమింగ్టన్ పట్టణం ఒక చక్కని వేదిక గా రూపు దిద్దుకోబోతుంది అని తెలియ జేయడానికి సంతోషిస్తున్నామని నిర్వాహకులు అన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులు, స్వయం సేవకులు, వారి కుటుంబాలు అందరికి సాయి సంస్థాన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.