కువైట్లో కారు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు మృతి
చిత్తూరు: కువైట్లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా మనదపల్లెకు చెందిన గౌస్ బాషా(35), అతని భార్య(30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.
గౌస్ భాషా రాజంపేట పట్టణంలోని ఎగువగడ్డలో ఉన్న తాత వద్ద ఉంటూ స్థానిక ఓ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత తన స్వగ్రామమైన మదనపల్లెకు వెళ్లారు. అక్కడ్నుంచి బెంగళూరు వెళ్లి వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. ఆ తర్వాత బెంగళూరు నుంచి కువైట్కు వెళ్లారు.

ఈ క్రమంలో గౌస్ భాషా, ఆయన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి కారులో వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడటంతో వారంతా మృతి చెందినట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదం జరిగింది నిజమేనని.. మృతి చెందినట్లు చెబుతున్న వ్యక్తికి ఫోన్ చేస్తే అందుబాటులో రావడం లేదని గౌస్ భాషా సమీప బంధువులు తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. వారి మృతదేహాలను చూసే వరకు నిర్ధారించలేమని గౌస్ భాషా బంధువులు పేర్కొన్నారు. భాషా కుటుంబసభ్యులు మరణించారన్న వార్తతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై ప్రభుత్వాలు సరైన సమాచారం ఇవ్వాలని మృతుడి బంధువులు, స్థానికులు కోరుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications