Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NRI News: విదేశాంగ శాఖ సాయంతో హైదరాబాద్ కు తిరిగొచ్చిన యువకుడు..

హైదరాబాద్‌లోని గోల్కొండ ఖిలాలోని మహ్మదీ లైన్‌కు చెందిన 26 ఏళ్ల జాఫర్ అహ్మద్ సౌదీ వెళ్లాడు. అతను గత ఎనిమిది నెలలుగా తీవ్ర అస్వస్థతతో సౌదీ అరేబియా (KSA) బాధపడుతున్నాడు. అతను నవంబర్ 29 శనివారం నాడు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చాడు. జాఫర్ హైదరాబాద్ రావడానికి సకాలంలో సహాయం చేసినందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) నాయకుడికి జాఫర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి, జెడ్డాలోని భారత కాన్సులేట్‌కు, సౌదీ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు.

జాఫర్‌ పరిస్థితిని ఖాన్ డాక్టర్ ఎస్ జైశంకర్ దృష్టికి తీసుకెళ్లిన 72 గంటల్లోనే ఆయన స్పందించారు. నవంబర్ 24 న జాఫర్ తండ్రి ఐజాజ్ అహ్మద్ ఎంబీటీ నాయకుడు అమ్జెద్ ఉల్లా ఖాన్‌ను వెళ్లాడు. తన కొడుకు పరిస్థితి వివరించి హైదరాబాద్ కు తిరిగి తీసుకురావాలని కోరాడు. జెడ్డాలోని కార్టన్ పరిశ్రమలలోని అల్ జవరాహ్‌లో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం రావడంతో జాఫర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ అరేబియాకు వెళ్లాడు. పని చేస్తున్న సంస్థలో ప్రమాదకరమైన రసాయన పొగలు రావడంతో ఉబ్బసం మొదలైది. అది సైనసైటిస్‌ను మరింత తీవ్రతరం చేసింది.

Hyderabad man returns from Saudi Arabia with help from Ministry of External Affairs

రెండుసార్లు ఆసుపత్రిలో చేరినా ఫలితం లేకపోయింది. దీంతో జాఫర్‌ ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నాడు. జాఫర్ ఇంటికి తిరిగి రావడానికి చేసిన ప్రయత్నాలను అతని కఫీల్ (స్పాన్సర్) అడ్డుకున్నాడు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ జాఫర్ ను ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. జాఫర్ కు తిండి, మందులు వంటివి లేకుండా చేశారు. దీంతో జాఫర్ రియాద్ లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి అనారోగ్యంతోనే ఉన్నాడు. ఈ విషయాన్ని తండ్రి చెప్పాడు.

దీంతో తండ్రి అమ్జెద్ ఉల్లా ఖాన్‌ను కలిశాడు. అమ్జెద్ ఉల్లా ఖాన్ (ప్రతినిధి) జాఫర్ అహ్మద్ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, సౌదీ అరేబియాలోని జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఇద్దరూ జాఫర్ అహ్మద్‌ను సంప్రదించి మాట్లాడారు.

దీంతో యజమాని జాఫర్ కు పాస్ పోర్ట్ ఇచ్చాడు. దీంతో జాఫర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. తన కొడుకును క్షేమంగా తిరిగి తీసుకురావడంలో సహాయం చేసినందుకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కి, రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం మరియు సౌదీ అరేబియాలోని జెడ్డాలోని ఇండియన్ కౌన్సెలేట్‌కి అతని తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+