యజమాని కుమారుడి కాల్పులు: ఎన్నారై మృతి
రియాద్: ఉపాధి కోసం సౌదీ అరేబియా వచ్చిన ఓ భారతీయు యువకుడు తన యజమాని కుమారుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగింది. బాధితుడు సౌదీ అరేబియాకు వచ్చిన వారం రోజులకే(గత శుక్రవారం) ఈ ఘటన చోటు చేసుకుంది.
మక్కా పోలీసుల కథనం ప్రకారం.. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన అనాస్ పుద్విలికాల్వి(24) మక్కాలోని ఓ వ్యక్తి ఇంట్లో కారు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు వారం రోజుల క్రితమే సౌదీ అరేబియాలోని మక్కాకు వచ్చాడు.

శుక్రవారం తన యజమాని కుటుంబ సభ్యులను తౌఫా తీసుకెళ్లిన అనాస్ పుద్విలికాల్వి.. తిరిగి అదే రాత్రి వారి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలోనే యజమాని కుమారుడు.. అనాస్పై కాల్పులు జరిపాడు.
కాల్పుల్లో అనాస్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని మక్కాలోని కింగ్ ఫైసల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చెప్పారు.
-
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
చంద్రగ్రహణం కారణంగా కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే!












Click it and Unblock the Notifications