వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై మహిళ సజీవదహనం

|
Google Oneindia TeluguNews

fire
మెల్బొర్న్: ఆస్ట్రేలియాలో నివాసముంటున్న ఓ భారతీయ మహిళ మంటల్లో కాలిపోయి తీవ్రగాయాలు కావడంతో మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. మహిళ మృతిపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పర్వీందర్ కౌర్ అనే భారతీయ మహిళ 85శాతం కాలిన శరీరంతో మంగళవారం మృతి చెందింది. మృతురాలు పర్వీందర్ కౌర్ తన భర్త కుల్విందర్ సింగ్‌తో కలిసి ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చింది.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తన కథనంలో.. పర్వీందర్ కౌర్ పెట్రోలు మంటలలో 85శాతం కాలిపోయి మరణించిందని, అయితే ఆ ఘటన ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని పేర్కొంది. కాగా సోమవారం రౌస్‌హిల్‌లోని తన నివాసం నుంచి మంటలలో కాలిపోతూ వచ్చిన పర్వీందర్ కౌర్ ఇంటి ముందు కుప్పకూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

బాధితురాలి మంటలలో కాలిపోతుండగా ఆమె భర్త కుల్విందర్ సింగ్ తన చేతులతో నియంత్రించేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అయితే పర్వీందర్ కౌర్ ఇంటి పొరుగువారు మాత్రం ఆమె మంటల్లో కాలిపోతూ సహాయం కోసం అరుపులు చేసుకుంటూ ఇంటి బయటికి వచ్చి కుప్పకూలిందని పేర్కొన్నారు. బాధితురాలు మంటల్లో కాలిపోతూ ఇంటి బయటికి వచ్చిన సమయంలో ఆమె భర్త ఓ దుప్పటిని కప్పేందుకు ప్రయత్నించాడని మరో సాక్షి చెప్పారు.

డిటెక్టివ్ సూపరింటెండెంట్ రాబ్ క్రిత్లా మాట్లాడుతూ..బాధితురాలి భర్త కుల్విందర్ సింగ్‌ను విచారించామని, అయితే ఘటనకు సంబంధించి అతను భిన్నమైన వాదన వినిపించారని చెప్పారు. ఇది ఒక భయానకమైన మరణమని, ఆమె సహాయం కోసం అరుపులు చేసిందని ఆయన తెలిపాడు.

English summary
Police have launched a probe into the death of a 32-year-old Indian woman who died in Australia after suffering serious burn injuries. Parwinder Kaur died on Tuesday after she suffered 85 per cent burns on her body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X