NRI News: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై దాడి.. స్పందించిన కేటీఆర్..
అమెరికాలో తెలుగు విద్యార్థిపై దాడి జరిగింది. యూఎస్ లో ఎంఎస్ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిపై నిందితుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇండియాలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్ పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు.
ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నాడు. వరుణ్ ఎంఎస్ చేస్తూనే పార్ట్టైం జాబ్ కూడా చేస్తున్నాడు. మంగళవారం వరుణ్ జిమ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఒక్కసారి ఓ దుండగుడు కత్తితో అతడిపై దాడికి దిగాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వరుణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వరుణ్ను ఆసుపత్రికి తరలించారు.

వరుణ్ పై దాడి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని చెప్పారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్కు కావాల్సిన సహకారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు. వరుణ్ కుటుంబసభ్యులతో తన టీం మాట్లాడుతుందని పేర్కొన్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications