మలేసియాలో యువకుడి అనుమానాస్పద మృతి
నల్లగొండ: మలేషియాలో నల్లగొండ జిల్లా దామరచర్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మాచర్ల సైదయ్య (26) 17 నెలల క్రితం మలేషియాకు వె ళ్లాడు. కౌలాలంపూర్కు 70 కిలోమీటర్ల దూరంలోని ఐలాండ్ పట్టణం కనేరియా ఆస్పత్రిలో అసిస్టెంట్ డాక్టర్గా చేరాడు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి నలుగురు స్నేహితులతో కలిసి కారులో డిన్నర్కు వెళ్ళి వచ్చాడు.
అనంతరం తన గదిలో నిద్రలోకి జారుకున్న అతడు శనివారం ఉదయం మృతిచెందాడు. ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం తెలిపారు. అయి తే శనివారం గుంటూరు జిల్లాలో ఉన్న అమ్మమ్మతో సైదయ్య ఫోన్లో మాట్లాడినట్లు బంధువులు చెబుతున్నారు. సైదయ్య మృతిపై తండ్రి వెంకటేశ్వర్లు, సోదరుడు నాగరాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతదేహాన్ని ఇక్కడికి తెప్పించేందుకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీకి వెళ్లాడని, శనివారం ఉదయం ఫ్లాట్లో మరణించి పడి ఉన్నాడని చెబుతున్నారు. అయితే, కుటుంబ సభ్యులు ఆస్పత్రివర్గాలను సంప్రదిస్తే భిన్నమైన మాటలను వినిపిస్తున్నారు. సైదయ్య ప్రమాదానికి గురైనట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాడని సైదయ్య తండ్రి వెంకటేశ్వర్లు అంటున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications