షాకింగ్: అడవిలో గాయపడి 3 రోజులు పాకి వచ్చాడు
కౌలాలంపూర్: మలేసియాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. 33 ఏళ్ల భారతీయ వ్యక్తి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మూడు రోజుల పాటు మలేసియాలోని అడవిలో పాకుతూ సహాయం కోసం సురక్షితమైన చోటికి చేరుకున్నాడు.
ఆ కారు ప్రమాదంలో మరో భారతీయుడు మరణించాడు. ప్రమాదం గత ఆదివారం మధ్య మలేసియాలోని బీదోర్లో జరిగింది. కారును నడుపుతున్న నికోలస్ ఆండ్ర్యూ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు 20 మీటర్ల లోతు గల లోయలోకి జారిపడింది.

ఆ ప్రమాదంలో ఆండ్ర్యూ కుడి చేయి, కాలు విరిగాయి. దీంతో అతను ప్రవాహంతో పాటు పాకుతూ ముందుకు సాగాడు. అతని మిత్రుడు ఆర్ త్యాగరాజన్ (34) అక్కడికక్కడే మరణించాడు. తాను ప్రవాహంలోని నీటిని మాత్రమే తాగానని, మూడు రోజుల పాటు చెట్ల కింద నిద్రపోయానని నికోలస్ చెప్పాడు.
తన సోదరుడు వివాహం కార్డులు పంపిన తర్వాత తాను ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని, అయితే తాను నియంత్రణ కోల్పోవడంతో కారు లోయలో పడిపోయిందని అతను వివరించాడు. లోయలోంచి పైకి రావడానికి ప్రయత్నించానని, అయితే గాయాల కారణంగా సాధ్యం కాలేదని అతను చెప్పాడు. దాంతో తాను పాకుకుంటూ రావడమే మంచిదని భావించానని అతను చెప్పిటన్లు న్యూ స్ట్రెయిట్స్ టైమ్స్ రాసింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications