Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నగ్నమునికి తనికెళ్ల భరణి అవార్డు

Nagamuni awarded Tanikella Bharani award
విజయవాడ: నాటి రాజకీయ నాయకులు ప్రజాసేవకు అధిక ప్రాధాన్యతనిస్తే, నేటి నాయకులు డబ్బుకే అధి క ప్రాధాన్యతనిస్తున్నారని అధికార భాషా సం ఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని కుళ్లును సహించలేక కలం పట్టిన నగ్నముని వంటి కవులు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనకాభిషేకం పేరుతో తనికెళ్ల భరణి సాహితీ పురస్కారం-2013 ఆదివారం రాత్రి విజయవాడలో నగ్నమునికి ప్రదానం చేశారు.

నిస్వార్థంతో పనిచేసే అనేకమంది రాజకీయ నాయకులున్న కాలంలోనే నగ్నముని రాజకీయాల్లోని కుళ్లు, కుతంత్రాలను కళ్లకు కట్టినట్లు తన రచనల ద్వారా చూపించారని, ప్రస్తుత పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉందని బుద్ధప్రసాద్ అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ 60, 70 దశకంలో సాహిత్య ప్రపంచంలో ఓ షాక్ ఇచ్చిన వ్యక్తి నగ్నముని అన్నారు.

నగ్నముని కొయ్యగుర్రం అనే దీర్ఘ కావ్యాన్ని రాశారు. విలోమ కథలు పేరు మీద అత్యవసర పరిస్థితిపై కథానికలు రాశారు. ఈ కథలు తెలుగు కథా సాహిత్యంలో కొత్త ఒరవడిని పెట్టాయి. దివిసీమ ఉప్పెనపై రాసిన కొయ్యగుర్రం తెలుగు సాహిత్యంలో విశేషమైన కావ్యంగా నిచించింది.

తూర్పు గాలి వచన కవితా సంపుటిని ఆయన వెలువరించారు. దిగంబర కవుల్లో ఆయన అగ్రశ్రేణి కవిగా నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+