వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై 'తొలి పూజ' కావ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

 NRI pens on Tirumala venkateswara swami
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుని శిలావిగ్రహం తొలిసారి ఎవరు చూసారు?ఆ ఏడుకొండల వెంకన్నస్వామికి "తొలి పూజ" ఎవరు చేసారు? ఆ పూజ ఏ విధంగా చేసారు?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా "తొలి పూజ" పుస్తకాన్ని రచించాడు ఓ ఎన్నారై యువకుడు. అతని పేరు తాడిమర్రి శ్రీనివాస రెడ్డి, అమెరికా లోని బోస్టన్ నివాసి. శనివారం సాయంత్రం రవీంద్రభారతిలో ఈ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, శ్రీ డా.సి.నారాయణ రెడ్డి ఈ పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ - తొలి రచన లోనే ఇంత గొప్ప పదజాలం ప్రయోగించడం అధ్భుతమని అని అన్నారు. చక్కటి భక్తి భావాన్ని ఈ కావ్యంలో కనపరచారని రచయితను ప్రశంసించారు. వచన కవిత్వంతో, సరళమైన శైలితో, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ దివ్యకావ్యాన్ని రచించాచరని కొనియాడారు.

లాభాపేక్ష లేకుండా, ఈ పుస్తకం అందరికీ ఉచితంగా అందించాలని ఆకాంక్షిస్తూ, రచయిత అన్ని పబ్లిక్ లైబ్రరీలకు ఈ పుస్తకాన్ని ఉచింతంగా పంపిణీ చేసారు. ఇంటర్నెట్ లో కూడా, http://tolipooja.blogspot.com నుండి ఉచింతంగా డౌన్ లోడ్ చేసుకుని పొందవచ్చు.

English summary

 An NRI Tadimirrai Srinivas Reddy has written a book on Tirumala Venkateswara Swami. It was released by C Narayana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X