కథ రచనలో నవ్యత: జయధీర్

Jayadheer advocates commitment in writings
శ్రీకాకుళం: కథారచనల్లో నవ్యత ప్రతిబింబించినప్పుడే సాహిత్యానికి సార్థకత చేకూరుతుందని కవి, విమర్శకుడు, పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కథానిలయం 17వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్‌లో జరిగిన ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

రచనల్లో భావుకత, నిబద్ధతలపై విశ్లేషిస్తూ పలు సూచనలు ఇచ్చారు. విమర్శకుడి వ్యక్తీకరణను రచయిత స్వాగతిస్తే అలాంటి రచనలు ఉత్తమరచనలుగా నిలుస్తాయన్నారు. రచనల్లో విమర్శస్థాయిని పెంచవలసిన అవసరాన్ని గుర్తించాలని, పాక్షిక విమర్శలకే తప్పా క్షేత్రస్థాయిలో విమర్శించే అవకాశం పత్రికలకు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

నేటి సాహిత్యంలో అస్థిరత్వమే తప్ప మహారచనలు కానరావడం లేదన్నారు. పత్రికలు వెబ్‌సైట్‌లో రచనలను పొందుపరచడం ద్వారా విమర్శకుడికి అవకాశం కలుగుతుందని అప్పుడే మెరుగైన భావుకతకు ఆస్కారం ఏర్పడుతుందని జయధీర్ అన్నారు.

ప్రముఖ సాహిత్యవేత్త ఆచార్య కుందుర్తి రజనీకాంత్ (బెంగళూరు) కూడా మాట్లాడారు. ఏ కథావస్తువుకైనా క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం అవసరమన్నారు. ఎంచుకొనే రచనలు ఆదర్శంగా ఉండాలని ఉద్ఘాటించారు. కథానిలయం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు కాశీపట్నం రామారావు మాస్టారు మాట్లాడారు. సమష్టి కృషితో నేడు కథానిలయం సాహిత్యవేత్తల నిలయంగా మారిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+