వజ్రంలాంటి కవిత్వం 'సగం సగం కలిసి'
హైదరాబాద్: భూగర్భంలోంచి వజ్రంలా పవన్కుమార్ కవిత్వం వెలువడిందని, ఇక వెలుగులు వెదజల్లుతూనే ఉంటుందని సీనియర్ పాత్రికేయుడు టంకశాల అశోక్ అన్నారు. కోడం పవన్ కుమార్ రాసిన 'సగం సగం కలిసి' కవితా సంకలనాన్ని ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. పవన్కుమార్ బయటి ప్రపంచానికి తెలియకుండా కవిత్వాన్ని రాశాడని టంకశాల అశోక్ అన్నారు.
ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ పవన్కుమార్ మంచి కవి అని, అన్ని సందర్భాల్లోనూ ఆయన స్పందించాడని అన్నారు. కవిగా విస్తరిస్తూ ప్రతి సందర్భాన్ని కవిత్వీకరించాడని కొనియాడారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ బుద్ధిజీవుల్లో తమను తాము ప్రకటించుకోలేనితనం కనిపిస్తుందని, అందుకే పవన్ కుమార్ లాంటి వారెందరో తమ అనుభవాలను పంచుకోకుండా ఉండిపోతున్నారని అన్నారు. తెలంగాణ నవ నిర్మాణంలో తప్పనిసరిగా ఈ లక్షణాన్ని వదిలించుకోవాలన్నారు. ప్రతిభా పాఠవాలను ఇతరులతో పోటీపెట్టాల్సిందే అన్నారు. అప్పుడే తెలంగాణలో కొత్త సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు.

తెలంగాణ సాధన కార్పొరేట్ శక్తులపై ప్రజాస్వామ్య శక్తులు సాధించిన విజయమని నమస్తే తెలంగాణ సంపాదకుడు అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితల భాగస్వామ్యం కీలకమైందన్నారు. ఉద్యమాన్ని పాట నడిపించిందని, భావజాల ఐకత్యకు పునాది వేసిందని అన్నారు. పవన్ కుమార్ కవిత్వం అలాంటి వాతావరణంలోంచి వచ్చిందన్నారు. కోల్పోయిన గత వైభవాన్ని నిలబెట్టుకునేందుకు తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం జరగాలని అన్నారు.
ప్రముఖ కవి జింబో మాట్లాడుతూ జీవితపు పరుగులో తమలోకి తాము చూసుకోవడం తగ్గిందని, అది మళ్లీ తెలంగాణ ఉద్యమంతోనే మొదలైందని అన్నారు. ఆధిపత్యానికి చిహ్నంగా నిలిచిన ట్యాంక్బండ్పై కొత్త ప్రతీకలు వెలవాలన్నారు. కవి వెంకటేశ్ మాట్లాడుతూ పవన్కుమార్ గొప్ప స్పందన గల కవి అన్నారు. ప్రముఖ కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతూ - పవన్కుమార్ సగం కవి, సగం పాత్రికేయుడని, తెలంగాణ ఉద్యమం వెంట ఆయన కవిత్వం నడిచిందని తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications