Shoaib Malik: షోయబ్ మాలిక్ కు బ్యాడ్ టైమ్- ఫిక్సింగ్ తో కాంట్రాక్ట్ రద్దు !
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు ఓ రేంజ్ లో బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇప్పటికే వరుస వైఫల్యాలతో అన్ని ఫార్మాట్లలోనూ జాతీయ జట్టులో చోటు కోల్పోయిన మాలిక్ కు తాజాగా సానియా మీర్జాతో విడాకుల వ్యవహారం చికాకు పెడుతూనే ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడుకుందామని భావించిన మాలిక్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో అతని కాంట్రాక్ట్ రద్దు చేస్తూ లీగ్ ఫ్రాంచైజ్ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్... ఫార్చూన్ బరిషల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే తాజాగా ఫార్చ్యూన్ బరిషల్ జట్టుతో కలిసి మూడు మ్యాచ్లు ఆడిన మాలిక్ వ్యక్తిగత కారణాలు చూపుతూ దుబాయ్కి తిరిగి వచ్చాడు. దీంతో మాలిక్ పై ఫిక్సింగ్ అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఫార్చూన్ బరిషల్ జట్టు మాలిక్ కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

జనవరి 22న షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఫార్చ్యూన్ బరిషల్ , ఖుల్నా రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఘటన చోటు చేసుకుంది. బరిషల్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ పవర్ప్లేలో షోయబ్ మాలిక్ను బౌలర్గా తీసుకురావాలని నిర్ణయించాడు. అయితే బౌలింగ్ కు దిగిన మాలిక్.. తన కెప్టెన్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతే కాదు ఆశ్చర్యకరంగా ఆ ఓవర్లో మూడు నో బాల్లు వేసి 18 పరుగులు ఇచ్చాడు. మాలిక్ వేసిన ఈ ఓవర్ తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
అదే సమయంలో తాజాగా పాకిస్తాన్ నటి సనా జావెద్ తో మూడో పెళ్లి చేసుకున్న మాలిక్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో పాటు మాలిక్ చెత్త బౌలింగ్, బీపీఎల్ లో అనుమాస్పదంగా వేసిన నో బాల్స్ పైనా ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫార్చ్యూన్ బరిషల్ యజమాని మిజానూర్ రెహమాన్ మాలిక్ పై ఫిక్సింగ్ అనుమానంతో అతనితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో బీపీఎల్ లో మాలిక్ తిరిగి ఆడే అవకాశం లేకుండా పోయింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications