భారత్ - వెస్టిండీస్ మ్యాచ్ వర్షంలో కొట్టుకుపోతే సెమీస్ చేరేదెవరు, లెక్క క్లియర్..!!
T20 World Cup Ind Vs WI: టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ లోకి టీమిండియా అడుగు పెడుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. జింబాబ్వే పైన గెలిచినా... టీం ఇండియా వెస్టిండీస్ తో తల పడాల్సి ఉంది. సెమీస్ చేరేందుకు రెండు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. సూపర్- 8 పాయింట్ల పట్టికలో జింబాబ్వేతో గెలుపు తరువాత టీమిండియా మూడో స్థానంలో ఉంది. కోల్ కతా మ్యాచ్ లో గెలిస్తే ఎలాంటి సమస్య లేకుండా సెమీస్ చేరుతుంది. మారుతున్న వాతావరణంతో వర్షం కురిచి మ్యాచ్ రద్దయితే.. సెమీస్ ఛాన్స్ ఎవరికి.. అసలు లెక్క ఏంటి..
జింబాబ్వే పైన టీమిండియా విజయం సాధించింది. గెలిచి పాయింట్లు పెరిగినా... కావాల్సిన రన్ రేటు మాత్రం రాలేదు. బ్యాటర్లు వీర విహారం చేసినా.. బౌలర్లు జింబాబ్వే బ్యాటర్ల నియంత్రణలో సక్సెస్ కాలేదు. ఫలితంగా రన్ రేటు పెంచుకోవాల్సి ఉన్నా... కావాల్సినంతగా రాలేదు. ఇక, మార్చి 1న కోల్ కతాలో జరిగే మ్యాచ్ టీం ఇండియా - వెస్టిండీస్ రెండు జట్లకు డూ ఆర్ డై గా మారింది. గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది. జింబాబ్వేతో మ్యాచ్ లో భారత్ బౌలర్ల ఆట తీరు చూసిన తరువాత భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్ తో మ్యాచ్ వేళ సందేహాలు మొదలయ్యాయి. విండీస్ లో ఓపెనర్ దగ్గర నుంచి చివరి వరకు అందరూ బంతిని బౌండరీకి పంపేందుకు వచ్చాం అనే విధంగా ప్రపంచ కప్ లో ఆడుతున్నారు. మరి.. వీరిని నియంత్రించేందుకు గంభీర్ - సూర్య కాంబో ఏం ప్లాన్ చేస్తారు.. బౌలర్లను ఎలా సమాయత్తం చేస్తారనేది విండీస్ తో మ్యాచ్ వేళ అసలైన పరీక్షగా మారుతోంది. బూమ్రా.. వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయటంలో వారి వ్యూహాలు ఫలించటం లేదు. దీంతో.. టీం పైన ఒత్తిడి పెరుగుతోంది.

రెండు జట్లకు చావో రేవో
ఇక.. కోల్ కతా మ్యాచ్ లో భారత్ గెలిస్తే రన్ రేటుతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. అదే విధంగా వెస్టిండీస్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయం అవుతుంది. భారత్ అప్పుడు టోర్నీ నుంచి సూపర్ -8 దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26న జరిగిన మ్యాచులు భారత జట్టుకు కలిసొచ్చాయి. మొదట జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్ను ఓడించడంతో టీమిండియాకు రూట్ క్లియర్ అయ్యింది. ఆ తర్వాత భారత్ తన వంతుగా జింబాబ్వేను చిత్తు చేసి 2 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం గ్రూప్-1లో భారత్, వెస్టిండీస్ రెండు జట్లూ రెండేసి మ్యాచులు ఆడి, చెరో విజయం (2 పాయింట్లు)తో సమానంగా ఉన్నాయి. దీనివల్ల ఆదివారం (మార్చి 01) జరగబోయే భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్గా మారిపోయింది. అయితే, కోల్కతాలో వాతావరణం మారుతోంది. ఈ కీలక మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారితే కనీసం 5 ఓవర్లు ఆడితేనే ఫలితం వస్తుంది. అదీ సాధ్యం కాకుంటే రన్ రేటు ప్రకారం విజేతను డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేటు -0.100 గా ఉండగా.. వెస్టిండీస్ రన్ రేట్ 1.791గా ఉంది. దీంతో విండీస్ కు రూట్ క్లియర్ అవుతుంది. దీంతో.. వర్షం లేకుండా.. భారత్ అన్ని రంగాల్లో రాణిస్తే.. సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన ఒకే ఒక్కడు, ఆయన మాటే శాసనం..!! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
కోచ్ సాబ్.. మీ నవ్వు కిల్లర్ కాంబినేషన్! -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
IND vs NZ: ప్రపంచ కప్ ఛాంపియన్ ఎవరో తేల్చేసిన AI ప్లాట్ ఫామ్స్, ఒకటే మాట..!! -
ఇష్టం లేకపోయినా టీమిండియా మేనేజ్మెంట్ చేసిన మంచి పని అదే -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
ఫైనల్లో హై-వోల్టేజ్ డ్రామా: అర్ష్దీప్, మిచెల్ మధ్య గొడవ! వీడియో -
ఆ ఇద్దరు దిగ్గజాలకు ఈ వరల్డ్ కప్ అంకితం: గంభీర్ -
మనకు తెలియట్లేదు గానీ కివీస్ బ్యాడ్ ట్రాక్ రికార్డుంది భయ్యో













Click it and Unblock the Notifications