IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్..!
IND vs AFG: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగే తొలి టీ20లో భారత క్రికెట్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్కు ముందే ప్రతి క్రికెట్ అభిమాని భారత జట్టు తుది జట్టులోని ఆటగాళ్లను ఆసక్తిగా గమనిస్తున్నారు. టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
వైభవ్ సూర్యవంశీ ఔట్
ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్ తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్లో విజయం సాధించిన జట్టు కూర్పుతోనే టీమిండియా బరిలోకి దిగింది, ఇందులో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. టీ20 ప్రపంచకప్లో సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. అయితే ఇంగ్లాండ్లో విఫలమవడంతో సంజు శాంసన్ను జట్టు నుండి తొలగించి.. అతని స్థానంలో వైభవ్ సూర్యవంశిని సెలెక్ట్ చేశారు.

తిరిగి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ కోసం తుది జట్టులోకి తిరిగి వచ్చాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత బుమ్రా ఈ ఫార్మాట్లో భారత్ తరఫున ఏ మ్యాచ్ ఆడలేదు. ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన వన్డే సిరీస్లో గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. బుమ్రాకు అర్ష్దీప్ సింగ్ మద్దతుగా ఉంటాడు. ఇది కాకుండా జట్టులో నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే అనే ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్లు ఉన్నారు.వైభవ్ సూర్యవంశీతో పాటు, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్ కూడా తుది జట్టులో లేరు. జింబాబ్వేలో అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్ను, గాయపడిన హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి తీసుకున్నారు.
ఇరు జట్ల ప్లేయింగ్-11 వివరాలిలా..
భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
ఆఫ్ఘనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సెడిఖుల్లా అటల్, దర్వీష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.













Click it and Unblock the Notifications
