IND Vs SA: విశాఖ మ్యాచ్ లో ఆ మగ్గురు ఔట్, వీరు ఇన్: రో-కో కు కలిసొచ్చిన గ్రౌండ్..!!
విశాఖ క్రికెట్ మేనియా కనిపిస్తోంది. మూడో వన్డే కోసం క్షణాల్లో టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. రోహిత్ - కోహ్లీ కాంబో కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. కోహ్లీ వరుస సెంచరీలతో విశాఖ వన్డే పై అంచనాలు పెరుగుతున్నాయి. విశాఖ కోహ్లీకి కలిసొచ్చే గ్రౌండ్. మంచి రికార్డులు ఉన్నాయి. కాగా, రెండు జట్లు ప్రాక్టీసు మొదలు పెట్టాయి. సిరీస్ డిసైడర్ గా నిలిచే మ్యాచ్ కావటంతో మరింతగా ఆసక్తి నెలకొంది. సాగర తీరాన మరోసారి బౌండరీల హోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ముగ్గురిని తప్పించి.. వారి స్థానంలో మరో ముగ్గురికి అవకాశం దక్కనుంది.
విశాఖ కేంద్రంగా శనివారం జరిగే భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ కు భారీ స్పందన కనిపిస్తోంది. భారత్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగుతుండడంతో స్టేడియం కిక్కిరిసిపోనుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మ్యాచ్కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సాధారణంగా భారత్లో క్రికెట్ మ్యాచ్కు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ విరాట్ కోహ్లీ అడుతున్నాడంటే మ్యాచ్ స్టేడియంలో చూడాల్సిందే అని అనుకునే ఫ్యాన్స్ వేలల్లో ఉంటారు. అలాగే చిన్న బ్రేక్ తర్వాత విరాట్ ఈ సిరీస్లో ఆడుతున్నాడు. తొలి రెండు వన్డేల్లోనూ రెండు సెంచరీలు బాది ఊపుమీద కనిపిస్తున్నాడు. దీంతో విశాఖ వన్డేకు భారీ క్రేజ్ ఏర్పడింది. నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.

రాంచి వన్డేలో విరాట్ సెంచరీ బాదిన తర్వాత టికెట్ అమ్మాకాల్లో జోరు పెరిగింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లను ఏసీఏ పలు విడతల్లో టికెట్ అమ్మకాలు జరిపింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 28న తొలి విడతగా టికెట్ సేల్ ప్రారంభించింది. అయితే ఈ విడతలో టికెట్ అమ్మకాలు అనుకున్న స్థాయిలో జరగలేదట. చాలా వరకు మిగిలిపోయాయట. అయితే నవంబర్ 30న రాంచీలో విరాట్ సెంచరీతో అదరగొట్టిన తర్వాత, విశాఖ వన్డే టికెట్ సేల్స్ జోరు పెరిగింది.
డిసెంబర్ 01, 03న మరోసారి ఆన్లైన్లో టికెట్లు విక్రయానికి అందుబాటులోకి రాగా, అప్పుడు నిమిషాల్లోనే అన్ని అమ్ముడయ్యాయి. నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయినట్లు తెలిపారు. ఇందులో రూ.1200 నుంచి రూ.18000 వేల రేంజ్లో టికెట్లు ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో కోహ్లీ ఇప్పటిదాకా 7 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇందులో 97.83 యావరేజ్తో విరాట్ మూడు సెంచరీ నమోదు చేశాడు. వాటితోపాటు ఓ మ్యాచ్లో 99 పరుగులు, ఇంకొక వన్డేలో 65 రన్స్ స్కోర్ చేశాడు. దీంతో.. ఇప్పుడు రో- కో మేనియా తో మ్యాచ్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. కాగా, తొలి రెండు మ్యాచ్ ల్లో విఫలమైన జైశ్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ను తప్పించి వారి స్థానంలో జురెల్, నితీష్, తిలక్ను తీసుకోనున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications