IPL 2024: ఈసారి ఐపీఎల్ లో కీలక మార్పు-ఇక రివ్యూలు మరింత వేగంగా, కచ్చితంగా..
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. దేశంలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడతను భారత్ లో నిర్వహించనున్న బీసీసీఐ.. రెండో దశను మాత్రం యూఏఈలో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. దీంతో పాటు ఈసారి సీజన్ లో పలు కీలక మార్పుల్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. తద్వారా ఆట మరింత రంజుగా మారబోతోంది. అలాగే ఆటను మలుపు తిప్పే నిర్ణయాలు కూడా మరింత కచ్చితంగా రాబోతున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతున్నప్పుడు మధ్యలో అనుకోకుండా ఓ రీప్లే అవసరం వచ్చి సమీక్ష చేయాల్సి వస్తే ఒక్కోసారి ఎక్కువ సమయం తీసుకుంటోంది. అదే వేగంగా రీప్లేలు వచ్చేస్తే సమీక్షలు కూడా మరింత వేగంగా, కచ్చితంగా చేసేందుకు అంపైర్లకు అవకాశం దక్కుతుంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు స్మార్ట్ రీప్లే సిస్టమ్ ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో రివ్యూలు మరింత కచ్చితంగా, వేగంగా వెలువడనున్నాయి.

ఈ స్మార్ట్ రీప్లే విధానంలో టీవీ అంపైర్ ఇద్దరు హాక్-ఐ ఆపరేటర్ల నుండి నేరుగా ఇన్పుట్లను స్వీకరిస్తారు. వారు అంపైర్ తో పాటు ఒకే గదిలో కూర్చుని హాక్ ఐ హైస్పీడ్ కెమెరాల ద్వారా తీసిన వీడియోలను అందిస్తారు. అదే సమయంలో ఇప్పటి వరకు థర్డ్ అంపైర్ ,హాక్-ఐ ఆపరేటర్ల మధ్య లింక్ గా ఉన్న టీవీ ప్రసార డైరెక్టర్ ఇకపై కొత్త విధానంలో ఉండరు. స్మార్ట్ రీప్లే సిస్టమ్ టీవీ అంపైర్ స్ప్లిట్-స్క్రీన్ ఇమేజ్లతో సహా గతంలో యాక్సెస్ చేసిన దానికంటే ఎక్కువ విజువల్స్ను ఇస్తుంది.
బౌండరీ రోప్పై మొదటి ఫీల్డర్ గాలి మధ్యలో తీసుకున్న రిలే క్యాచ్ను గతంలో ప్రసార సంస్ధ బంతిని పట్టుకున్న ఖచ్చితమైన సమయంలో ఫీల్డర్ పాదాలు , చేతుల స్ప్లిట్ స్క్రీన్ను అందించలేకపోయేది. కొత్త విధానంలో, స్ప్లిట్ స్క్రీన్ బాల్ క్యాచ్ చేయబడినప్పుడు లేదా విడుదలైనప్పుడు అంపైర్కు పాదాల దగ్గరి ఫుటేజ్ తో పాటు చూపిస్తుంది. దీంతో రివ్యూ సిస్టిమ్ కూడా మెరుగుపడనుంది.












Click it and Unblock the Notifications