భారత్ సెమీస్ చేరాలంటే ఆ జట్టుతోనే అసలు ప్రమాదం..!!
T20 World cup: టీమిండియా సెమీస్ చేరుతుందా. ఈ రోజు రెండు మ్యాచుల తరువాత సెమీస్ పైన స్పష్టత రానుంది. అటు దక్షిణాఫ్రికా టాస్ గెలిచి వెస్టిండీస్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్ప కూలింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిస్తే భారత్ కు కలిసి వచ్చే అంశంగా మారుతుంది. ఇక.. జింబాబ్వేతో భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. గెలుపు కాదు.. అంత కంటే అనే స్థాయిలో ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంది. కాగా.. ఇప్పుడు భారత్ సెమీస్ లెక్కల వేళ మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు.
టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీస్ చేరాలంటే ఈ రోజు జరిగే జింబాబ్వేతో మ్యాచులో అదే విధంగా మార్చి 1న వెస్టిండీస్ తో జరిగే మ్యాచులోనూ భారీ విజయం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక.. ప్రస్తుతం వెస్టిండీస్ - సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫలితం కూడా టీమిండియా సెమీస్ అవకాశం పైన ప్రభావం చూపనుంది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బౌలర్లు వెస్టిండీస్ టాప్ ఆర్డర్ ను తక్కువ స్కోరుకే ఒకరి తరువాత మరొకరిని పెవిలియన్ కు పంపుతున్నారు. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిస్తే భారత్ కు అవకాశాలు మెరుగు పడతాయి. అయితే, రన్ రేటు ఇప్పుడు టీమిండియా కు కీలకంగా మారుతోంది. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో టీమిండియా ప్రస్తుతం ఉన్న మైనస్ రన్ రేటు నుంచి మంచి రన్ రేటు సాధించటంతో పాటుగా పాయింట్ల పట్టికలో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాలి. కాగా.. జింబాబ్వేతో మ్యాచ్ వేళ మాజీ క్రికెటర్ శ్రీకాంత్ చేసిన విశ్లేషణ ఆసక్తి కరంగా మారుతోంది.

ఈ రోజు మ్యాచుల తరువాత స్పష్టత
మాజీ క్రికెటర్ శ్రీకాంత్ భారత్ జట్టుకు కీలక అలర్ట్ ఇచ్చారు. ప్రపంచ కప్ లో ఇప్పుడు ఆడాల్సిన రెండు మ్యాచులు కీలకంగా మారటంతో ఇప్పుడు ప్రతీ ఆటగాడి పైన బాధ్యత ఉందని చెప్పారు. అయితే, వెస్టిండీస్ కంటే ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న జింబాబ్వే డేంజర్ టీం అని శ్రీకాంత్ ఆ టీం సామర్ధ్యం గురించి చెప్పుకొచ్చారు. టీమిండియా పైన ఒత్తిడి ఉందని.. దీంతో, జింబాబ్వే పూర్తిగా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని విశ్లేషించారు. సెమీస్ అవకాశం వెస్టిండీస్ కు ఎక్కువగా ఉందని వివరించారు. దీంతో.. ఒత్తిడి వదిలేస్తేనే టీమిండియా సెమీస్ వైపు వెళ్లటానికి రూటు క్లియర్ అవుతుందని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా - వెస్టిండీస్ మ్యాచు ఫలితం కూడా ప్రభావం చూపనుంది. వెస్టిండీస్ గెలిస్తే మొత్తం లెక్కలు మారే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. ఈ రోజు రెండు మ్యాచుల ఫలితం తరువాత సెమీస్ సమీకరణాల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications