మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది!
PSL 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ఆరంభమే కామెడీని తలపిస్తోంది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్మెన్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఓ వింత పరిస్థితి ఎదురైంది.స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడం, వీఐపీల హంగామా వంటి వివాదాలు సరిపోవన్నట్లు.. ఇప్పుడు ఏకంగా బంతి రంగు మారిపోవడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. ఆట సాగుతుండగానే తెల్లటి బంతి కాస్తా గులాబీ రంగులోకి.. ఆపై ఎర్రగా మారిపోయింది. దీనికి కారణం హైదరాబాద్ కింగ్స్మెన్ ఆటగాళ్లు ధరించిన జెర్సీల రంగు బంతికి అంటుకోవడమే. సాధారణంగా బంతిని మెరిపించడానికి ప్లేయర్లు తమ దుస్తులకు రుద్దుతుంటారు. అలా రుద్దినప్పుడు జెర్సీ రంగు బంతికి అంటుకుని అది రంగు మారిపోయింది.
ఫిర్యాదు చేసిన లబుషేన్.. అంపైర్లు షాక్!
హైదరాబాద్ కింగ్స్మెన్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ ఈ విషయాన్ని గమనించి వెంటనే అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. "నా కెరీర్లో బంతి రంగు ఇలా మారిపోవడం ఎప్పుడూ చూడలేదు" అని లబుషేన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సాధారణంగా బ్యాట్ లేదా ప్యాడ్ తగిలితే కొంచెం రంగు అంటుకుంటుంది.. కానీ ఇలా జెర్సీ వల్ల బంతి కలర్ మారడం అత్యంత అసాధారణమని లబుషేన్ పేర్కొన్నాడు. పరిస్థితిని గమనించిన అంపైర్లు వెంటనే బంతిని మార్చాల్సి వచ్చింది.

నెట్టింట ట్రోల్స్.. పింక్ బాల్ మ్యాచ్ అంటూ సైటైర్లు
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఉతికారేస్తున్నారు. "అంతర్జాతీయ స్థాయి లీగ్లో ఇంత నాసిరకం జెర్సీలు వాడుతారా!" అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓడిపోయినప్పటికీ హైదరాబాద్ కింగ్స్మెన్ జట్టు అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా వ్యంగ్యంగా స్పందించింది. "పీఎస్ఎల్ చరిత్రలోనే తొలి పింక్ బాల్ మ్యాచ్ గెలిచినందుకు ప్రత్యర్థి జట్టుకు అభినందనలు" అంటూ పోస్ట్ చేయడంతో ఈ విషయం మరింత వైరల్ అయింది.
This is embarrassing moment for Hyderabad and Fawad Sarwar,
— SheR•ALI (@Sher__Ali) March 26, 2026
Due to the trouser color of Hyderabad Kingsmen, the ball has turned into pink, Quality of jersey Should have been checked pic.twitter.com/cKJaxFGcIn
లాహోర్ ఘనవిజయం
ఈ రంగుల గందరగోళం మధ్య జరిగిన మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ జట్టు 69 పరుగుల తేడాతో హైదరాబాద్ కింగ్స్మెన్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేయగా.. లక్ష్య చేదనలో హైదరాబాద్ జట్టు కేవలం130 పరుగులకే పరిమితం అయింది. లాహోర్ బ్యాటర్ ఫఖర్ జమాన్ (53 పరుగులు) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
🚨🚨Marnus Labuschagne on the change of ball color
— SheR•ALI (@Sher__Ali) March 26, 2026
"I did say to the umpires after the second over, What’s going on? The ball is red, it must be from the clothes or something like that. I’ve never seen anything like pic.twitter.com/VHSXouHZYx
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications