ఇష్టం లేకపోయినా టీమిండియా మేనేజ్మెంట్ చేసిన మంచి పని అదే
టీ20 ప్రపంచకప్ లో సంజు శాంసన్ హీరోగా అవతరించాడు. వెస్టిండీస్, ఇంగ్లాండ్తో జరిగిన కీలక సెమీఫైనల్ మ్యాచ్లలో అతని అసాధారణ ప్రదర్శన భారత బ్యాటింగ్ లైనప్కు ఊపునిచ్చాయి. సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకురావడం నిర్ణయాత్మకంగా మారింది. ఈ టోర్నమెంట్ ఆసాంతం శాంసన్ అద్భుతమైన ఫామ్లో దూసుకెళ్తున్నాడు. నాలుగు మ్యాచ్లలో ఈ ఓపెనర్ 77.33 సగటుతో ఏకంగా 232 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 201.73గా నమోదైంది.
ఈ మెరుపు బ్యాటింగ్తో భారత్ ఆడిన చివరి రెండు మ్యాచ్లలో సూపర్ 8 మ్యాచ్, సెమీఫైనల్లో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. సూపర్ 8స్ దశలో వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో సంజు శాంసన్ 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 42 బంతుల్లో 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో మరోసారి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని వీరోచిత ఇన్నింగ్స్లు జట్టును ఫైనల్కు నడిపించాయి.

ఇప్పుడు యావత్ దేశం కేరళకు చెందిన ఈ స్టార్ ఆటగాడు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగే ఫైనల్లో మరోసారి మెరుస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది. ఈ కీలక మ్యాచ్లో సంజు మరోసారి తన అద్భుత ఆటతీరుతో జట్టును గెలిపించాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు. న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ను సంజు ఎలా ఎదుర్కొంటాడనేదే అతని ఇన్నింగ్స్ పరిమాణాన్ని నిర్ణయించడంలో కీలకం. 'సంజు శాంసన్ జొఫ్రా ఆర్చర్ను ఎదుర్కొన్న విధంగా మాట్ హెన్రీని కూడా ధీటుగా ఆడగలిగితే అతన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు.
వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆరంభంలో అభిషేక్ శర్మ జట్టుకు కీలకంగా మారతాడని అంచనాలు ఉండేవి. సంజు ప్రదర్శనపైనే సందేహాలు ఉండేవి. టోర్నీ కీలక దశకు వచ్చే సరికి పరిస్థితి రివర్స్ అయింది. సంజు నిలకడగా రాణిస్తోండగా.. అభిషేక్ శర్మ ఫామ్ పూర్తిగా కోల్పోయాడు. జింబాబ్వేపై ఇన్నింగ్ మినహా ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు. లీగ్ దశ తర్వాత కడుపు ఇన్ఫెక్షన్తో ఆసుపత్రి పాలు కావడంతో రిథమ్ కోల్పోయాడు.
అదే సమయంలో ప్రత్యర్థి జట్లు కూడా అతడి బలహీనతలను పసిగట్టాయి. పవర్ప్లేలో పేస్ బౌలింగ్ను ఇష్టపడే అభిషేక్కు స్పిన్నర్లను ప్రయోగించి కట్టడి చేశాయి. ఆఫ్ స్పిన్నర్లు, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లతో అతడిని పరుగులు చేయకుండా నిలువరిస్తున్నాయి. పేస్ లేని బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతూ, షాట్లకు తొందరపడి వికెట్ సమర్పించుకుంటున్నాడు అభిషేక్. ఈ పరిస్థితుల్లో అతని దూకుడుపై నమ్మకం ఉంచి, ఫైనల్ లో ఆడనివ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications