IPL 2026: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ప్రకటన-కమ్మిన్స్ స్ధానంలో..!
ఈ నెలాఖరులో ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభమవుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టోర్నీలో ఆరంభ మ్యాచ్ లకు దూరమవుతున్న నేపథ్యంలో అతని స్ధానంలో తాత్కాలిక కెప్టెన్ కు ప్రకటించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (ishan kishan)ను కెప్టెన్ గా సన్ రైజర్స్ అవకాశం కల్పించింది. ఇప్పటికే టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న ఇషాన్ కిషన్ కు పలు జట్లకు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది.
సన్రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2026లోని తొలి కొన్ని మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న కమ్మిన్స్.. ఐపీఎల్ లో ఆలస్యంగా చేరే అవకాశం ఉంది. గాయం కారణంగా ఇప్పటికే యాషెస్ టెస్టుల్లో ఒకదానిలో మాత్రమే ఆడిన కమ్మిన్స్.. తాజాగా టీ20 ప్రపంచ కప్కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం అతను గాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీంతో కమ్మిన్స్ గైర్హాజరీలో సన్ రైజర్స్ జట్టుకు ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇషాన్ కిషన్ కెప్టెన్ గా , మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. తాజాగా వరల్డ్ కప్ లో కిషన్ అద్బుత ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే దేశవాళీ టోర్నీల్లోనూ సత్తా చాటుకున్నాడు. జార్ఖండ్ తమ తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడంలో కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇది అతనికి 2026 టీ20 ప్రపంచ కప్లో భారత జట్టులోకి తిరిగి రావడానికి కూడా పనికొచ్చింది.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
RCB సంచలన నిర్ణయం- ఇక ప్రతీ మ్యాచ్ కూ స్టేడియంలో ఆ 11 సీట్లు రిజర్వ్..! -
రేసు గుర్రాన్ని పక్కన పెట్టిన ఆర్సీబీ -
ఆర్సీబీకి ఉత్తి పుణ్యానికి రూ. 16,706 కోట్లు -
వాల్మార్ట్ చేతికి రాజస్థాన్ రాయల్స్: రూ.15,300 కోట్లు, సింగిల్ పేమెంట్: ఎవరీ సొమానీ? -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇంగ్లండ్ స్టార్ సడన్ గుడ్ బై-నిషేధం తప్పదా ? -
IPL 2026 Fan Parks: 15 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ లు-తెలంగాణలో..! -
ఆరో గేర్లో బాదుతాడు.. కానీ ఐస్క్రీం వద్దే ఆగిపోతాడు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్














Click it and Unblock the Notifications