Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023: కోహ్లీ 49 సెంచరీలు చేస్తే గొప్పేంటి- ఆడుకుంటున్న నెటిజెన్లు

ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం విరాట్ ను ప్రశంసలతో ముంచెత్తుతోంది. క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీకి క్రికెట్ ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు. తన 35వ జన్మదినం నాడు సౌతాఫ్రికాతో మ్యాచ్ లో విరాట్ తన 49వ సెంచరీతో కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కు రిటర్న్ గిఫ్ఠ్ ఇచ్చారు. తన రికార్డు సమం చేసిన విరాట్ పై సచిన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మాత్రం సచిన్ పైన తనకు ఉన్న గౌరవం ఏంటో స్పష్టం చేసాడు.

విరాట్ ఆటకు ఫిధా: మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ విరాట్ ను ప్రశంసిస్తున్న వేళ శ్రీలకం కెప్టెన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడు. రికార్డుల రారాజు విరాట్ సెంచరీ పైన తేలిగ్గా మాట్లాడాడు. విరాట్ నామ స్మరణతో ఆదివారం సోషల్ మీడియా హోరెత్తింది. ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. కోహ్లీ సాధించిన ఘనతను అభినందించేందుకు శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ నిరాకరించాడు. ప్రపంచ కప్ నుంచి శ్రీలంక దాదాపు అవుట్ అయింది.

Sri Lankas Kusal Mendis refused to congratulate Virat Kohli for scoring 49th ODI century

నామ మాత్రపు మ్యాచ్ లో ఈ రోజు బంగ్లాదేశ్ తో తల పడనుంది. ఈ మ్యాచ్ సన్నద్దత పైన మీడియా సమావేశంలో శ్రీలంక కెప్టెన్ ను ఒక రిపోర్టర్ విరాట్ 49వ సెంచరీ పైన స్పందిస్తారా అని ప్రశ్నించాడు. దీనికి సాటి క్రీడాకారుడి గురించి..ఒక దేశ క్రికెట్ టీం కెప్టెన్ గా ఉంటూ కుశాల్ మెండీస్ ఇచ్చిన సమాధానం క్రికెట్ ఫ్యాన్స్ కు నచ్చటం లేదు.

క్రికెట్ ప్రపంచం ప్రశంసలు: విరాట్ 49వ సెంచరీ సాధించి..సచిన్ రికార్డు సమం చేసినందుకు అభినందనలు చెబుతారా అని ప్రశ్నించగా..దీనికి కుశాల్ షాకింగ్ సమాధానం చెప్పాడు. నేనెందుకు అతన్ని అభినందించాలి అంటూ కుశాల్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sri Lankas Kusal Mendis refused to congratulate Virat Kohli for scoring 49th ODI century

జెంటిల్మెన్ గేమ్ గా క్రికెట్ ఆటగాళ్లకు క్రీడా స్పూర్తి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్ధి టీం ఆటగాడు సెంచరీ చేసినా..ప్రత్యర్ధి టీం గెలిచినా పరస్పరం అభినందించుకుంటారు. కానీ, ఇప్పుడు ప్రపంచ కప్ లో ఒక టీం కెప్టెన్ గా ఉంటూ కుశాల్ స్పందించిన తీరు పైన సోషల్ మీడియాలో నెటిజెన్లు సీరియస్ గా స్పందిస్తున్నారు. తాజాగా శ్రీలంక ప్రభుత్వం ప్రస్తుత టీం..ఆ దేశ క్రికెట్ బోర్డు పైన కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

కుశాల్ మెండీస్ వైఖరితో: శ్రీలంక రెగ్యులర్ కెప్టెన్ దసున్ షనక గాయపడటంతో కుశాల్ మెండీస్ అనూహ్యంగా కెప్టెన్ పదవి దక్కించుకున్నాడు. ఇప్పుడు విరాట్ లాంటి సీనియర్..సిన్సియర్ ప్లేయర్ విషయంలో కుశాల్ స్పందించిన తీరు పైన ఫ్యాన్స్ సీరియస్ గా స్పందిస్తున్నారు. విరాట్ సెంచరీ చేసిన తరువాత సౌతాఫ్రికా లెజండరీ క్రికెటర్ ఏబీ డీవిలియర్స్ సైతం గ్రౌండ్ లో అభినందించారు.

ప్రపంచ క్రికెట్ లో సచిన్ నెలకొల్పిన రికార్డును సమం చేసిన విరాట్..ఈ ప్రపంచ కప్ లోనే మరో సెంచరీ చేస్తాడంటూ ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు హోరెత్తిస్తున్నారు. కుశాల్ మెండీస్ వైఖరి పైన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+