వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యానిమేటర్లకుడిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:భాగ్యనగరం యానిమేషన్‌ హబ్‌గామారిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి ముఖ్యంగా అమెరికానుంచి వచ్చినప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలంటేమరో 3,500 మంది స్కిల్డ్‌ యానిమేటర్లుకావాలని అంచనా. యానిమేటర్లకుచిత్రకళలో నైపుణ్యంతో పాటు ఐటిలోప్రవేశం ఉండాలి. చిన్నప్పుడు సరదాగాబొమ్మలు వేసుకునే పిల్లలను వారించి, పాఠాలుచదువుకోమని తలిదండ్రులు చెబుతుంటారు. అలా వారి కళాతృష్ణనుతుంచేసినందుకు పెద్దబాధపడాల్సిన సమయం వచ్చింది.

2డియానిమేషన్‌లో నైపుణ్యంసంపాదించాలంటే చిత్రకళ వచ్చి ఉండాలి.తమకు వస్తున్న ప్రాజెక్టులకు 2డియానిమేటర్లు అవసరమని, వారినితయారు చేసుకోవడం కష్టమనికంపెనీలు చెబుతున్నాయి. ఇంత మంది యానిమేటర్లు అందుబాటులోలేకపోవడంతో పెద్ద కంపెనీలు సబ్‌కాంట్రాక్టులు ఇచ్చి డెడ్‌లైన్స్‌లోగా పని పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నాయి.చైనా, జపాన్‌ వంటి ఆసియా దేశాలతో పోల్చితే మనదేశంలోయానిమేషన్‌ఖర్చు తక్కువ కాబట్టి అవుట్‌ సోర్సింగ్‌ ప్రాజెక్టులుమనదేశానికే వస్తున్నాయి. యానిమేషన్‌ స్కిల్స్‌విషయంలో భారతదేశంలో హైదరాబాద్‌దేఅగ్రస్ధానం. ప్రముఖ కార్టూనిస్టు మోహన్‌, ఉత్తమ్‌ ఇతర చిత్రకారులుపెద్ద సంఖ్యలో యానిమేటర్లనుతయారుచేశారు. భారతీయ కంపెనీలయానిమేషన్‌ బిజినెస్‌ ప్రస్తుతం ఏటా 750మిలియన్‌ డాలర్లు. ఈ వ్యాపారం ఏటా 20 శాతంచొప్పున పెరుగుతోంది.

26నిముషాల యానిమేషన్‌ ఎపిసోడ్‌ తయారుచేయడానికి 150 మంది స్కిల్డ్‌ యానిమేటర్లుఅవసరం. కొన్ని సంస్ధలు యానిమేషన్‌లోశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ, శిక్షణఅంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగాలేదని నిపుణులు చెబుతున్నారు. 2డి యానిమేషన్‌నేర్చుకోవాలంటే బేసిక్‌ఆర్ట్‌లో ప్రవేశం అవసరం.సృజనాత్మకత ఇంకా అవసరం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X