గొంతువిప్పిన కెసిఆర్
హోంపేజి టాక్ ఆఫ్ టుడే రాజకీయాలు 25-10-2005
న్యూఢిల్లీ:మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవంతర్వాత మొట్టమొదటి సారితెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)అగ్రనేత, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖర్రావు మీడియా ప్రతినిధులముందుకు వచ్చారు. మున్సిపల్ఎన్నికల్లో తెరాస పరాజయంతో ఆయనఇంత కాలం మీడియాకు దూరంగా వుంటూవచ్చారు. మంగళవారంనాడు ఆయనన్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులసమావేశంలో మాట్లాడారు. తమ పార్టీనిచీల్చేందుకు కుట్ర జరిగిందంటూ ఆయనమీడియా ప్రతినిధుల సమావేశంలోఅన్నారు.
తమపార్టీని చీల్చేందుకు ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ఆయనమిత్రుడు కె.వి.పి. రామచందర్రావు కుట్ర చేసిన మాట నిజమేననిచంద్రశేఖర్ రావు అన్నారు. అందుకుసంబంధించిన సాక్ష్యాధారాలు తనవద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ఈవిషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్లుఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్నిఎవరూ నీరు గార్చలేరని ఆయనఅన్నారు.
పార్టీలోతలెత్తని సంక్షోభంపై, పార్టీలోఅంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందనేబహిరంగ విమర్శలపై ఆయన తనసహజ శైలిలో సమాధానాలు ఇచ్చారు.వైయస్, కెవిపిల కుట్రకు సంబంధించినవివరాలను తగిన సందర్భంలో బయటపెడతామని ఆయన చెప్పారు. తమపార్టీ కలిసికట్టుగా ఉందని, తమకేమీఇబ్బందులు, సమస్యలు లేవని ఆయనఅన్నారు. అంతరంగిక ప్రజాస్వామ్యంలోపించిందనే విమర్శలను మీడియాప్రతినిధులు ప్రస్తావించగా కుటుంబంలోవైరుధ్యాలు తలెత్తుతుంటాయనిఆయన అన్నారు. ఏ పార్టీలోనైనా అటువంటివైరుధ్యాలు ఉంటాయని ఆయన అన్నారు.
ఇటీవలికథనాలు హోంపేజి