ఎన్నారైలకు వైఎస్తాయిలాలు
హోంపేజి టాక్ ఆఫ్ టుడే;/SPAN> జనరల్ 02-01-2006
హైదరాబాద్:హైదరాబాద్లో ప్రవాస భారతీయ దివస్జనవరి 9 నుంచి మూడు రోజుల పాటుహైదరాబాద్లో జరగబోతున్న విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు ఢిల్లీలో, ఒక సారి ముంబాయిలో ఈమహాసభలు జరిగాయి. ప్రవాస భారతీయులుముఖ్యమైనదిగా భావించే ఈ సమావేశంఈసారి హైదరాబాద్ నగరంలోజరగబోవడం మనకు గర్వకారణమే. ప్రవాస భారతీయులు గతంలోఐటి, సామాజిక సేవారంగాలకేపరిమితమయ్యే వారు. ఇప్పుడు అనేక మందిదేశ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఏంజరుగుతున్నదో నిశితంగాపరిశీలిస్తున్నారు. రాజకీయాల్లో మంచి మార్పులు రావాలనికోరుకుంటున్నారు.
భారత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకుఎన్నారైలను ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారిగామాత్రమే చూసేవి. మాతృభూమి మీదప్రవాసాంధ్రులకు ఎంత ఆప్యాయత,అనురాగం, అనుబంధం ఉంటాయో మనయాంత్రిక అధికార వర్గాలకుఅర్ధమయ్యేది కాదు. ఫలితంగాఎన్నారైలు విమానాశ్రయాల్లో వివిధ శాఖలఅధికారుల శల్య పరీక్షలకు, వారి చేతుల్లోఅవమనాలకు గురికావలసి వచ్చేది.హైదరాబాద్ నగరం ఇప్పుడువిదేశాలనుంచి పెద్ద ఎత్తున రియల్ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షిస్తున్న విషయంఅందరికీ తెలిసిందే. టూరిజం, ఎంటర్టైన్మెంట్ రంగం మన రాష్ట్రంలో బాగాఅభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ప్రవాసభారతీయుల పెట్టుబడులను ఆకర్షించాలనిప్రభుత్వం భావిస్తోంది.
హైటెక్ సిటీసమీపంలోని హైటెక్స్ ప్రాంగణంలోజరుగనున్న ప్రవాస భారతీయ దివస్కు రాష్ట్ర ప్రభుత్వంవిస్తృతమైన ఏర్పాట్లు చేసింది.రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై మనఅధికారులు ప్రత్యేక డిమాన్ర్స్టేషన్లుఇవ్వనున్నారు. హైదరాబాద్లోమొదటి సారిగా ఈ మహాసభలుజరుగనున్నాయి కాబట్టి విదేశాల్లోనితెలుగు వారు అధిక సంఖ్యలో హాజరుకానున్నారని అధికారులు చెబుతున్నారు. ఈసమావేశాల్లో ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి ప్రవాసాంధ్రులకు అనేకవరాలను ప్రకటించనున్నారు.మరిన్ని వివరాలకు www.pbd2006.org నుసందర్శించవచ్చు.
ఇటీవలి కథనాలు హోంపేజి